Ashtalakshami : ఇంట్లో ఆగ్నేయ దిక్కులో వండే వంట గది ముఖ్యమైంది. కడుపు నింపే వంట జరిగేది అక్కడే. అలాంటి వంటను ప్రారంభించే ముందు కొన్ని నియమాలు పాటిస్తే అష్టలక్ష్ములు ఆశీర్వచనం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. వంట చేసే ముందు స్నానం చేసిన తర్వాతే స్టవ్ దగ్గరకి రావాలి . మాత అన్నపూర్ణా దేవిని తలుచుకుని పని ప్రారంభిస్తే ఇంటికి , ఇంటి యజమానికి మేలు చేస్తుంది. వంటకు కావాల్సిన నూనె, నెయ్యి, పసుపు లాంటి వంట వస్తువులు అన్నీ సిద్దం చేసుకుని దగ్గర పెట్టుకునే తర్వాతే ప్రారంభించాలి. మధ్య వాటి కోసం పరుగులు పెట్టకూడదు. వంట గదిని ఎప్పుడు శుభ్రంగా సుచిగా ఉంచుకోవాలి.ఈ నియమాలు పాటించి వంటను చూస్తే లక్ష్మీ కటాక్షం ఇంటి యజమానికి ప్రాప్తిస్తుంది.
దేవుడి గదిలో పూజ చేసే ముందు బొట్టు పెట్టుకున్న తర్వాత దీపాలు వెలిగించాలని శాస్త్రం చెబుతోంది. అలా బొట్టు లేకుండా దీపాలు వెలిగించడం క్షేమ దాయకం కాదు. వెలిగించే దీపాలు కూడా కడిగి శుభ్రంగా ఆరిన తర్వాతే వెలిగించాలి. ప్రమిదలు తడిగా ఉన్నప్పుడే నూనె పోయడం లాంటివి చేయకూడదు.అంతా పద్దతిగా చేసిన తర్వాతే దీపారాధన పూర్తి చేయాలి. వెలిగించే దీపంలో వేలు తగిలించకూడదు.చేసే పూజ మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో భక్తితత్వంతో చేయాలి. వంట పని చేస్తూ మధ్యలో వేరే వారితో మాట్లాడుతూ పూజను చేయకూడదు. అటు ఇటూ దిక్కులు చూస్తూ దీపాలు అసలు వెలిగించకూడదు. దీపలక్ష్మిని తలుచుకుని వెలిగించి భక్తితో ఆరాధన చేయాలి.
దీపారాధన ముందు, తర్వాత కూడా దేవుడికి నమస్కరించాలి. దీపం కొండ ఎక్కగానే నమస్కారం తప్పనిసరి. దీపం మధ్యలో కొండెక్కినా శంకించాల్సిన పనిలేదు. ఒకవేళ దీపం మధ్యంలో ఆరిపోతే పూజ మళ్లీ మొదట నుంచి చేస్తే సరిపోతుంది. ఎలాంటి అనుమానాలు పడాల్సిన పనిలేదు. దీపారాధన కుందెకి పసుపు , కుంకుమ రాసేటప్పుడు అందులో పడకుండా చూసుకోవాలి.