Shanishinganapur:ప్రసిద్ధ దేవాలయాలలో శని శింగణాపూర్ ఒకటి. ఈ ఆలయం షిర్డీకి సుమారు 90 కిమీ దూరం లో ఉంది. ఈ ఆలయం లో పూజలు ఆడవాళ్లు చేయకూడదు అని చెబుతుంటారు. శనీశ్వరునకు ప్రత్యేకంగా ఆలయం అంటూ ఏమి లేదు. ఇక్కడ స్వామి వారు స్వయంభు అని చెబుతారు . ఒక నల్లటి పొడవైన రాయి మాత్రమే ఉంటుంది. పూర్వం మేకలను మేపుకునే వారు శనీశ్వరుని రాయి అనుకుని పదునైన చువ్వతో రాయిని తాకగా ఆ రాయిలోంచి రక్తం రావడం చూసి వారు భయపడిపోయారు. ఈ అద్భుతాన్ని చూడ్డానికి చుట్టుప్రక్కల వారందరు వచ్చారు. ఆ రోజు రాత్రి మేకల కాపరి కలలో శనీశ్వరుడు కనిపించి నేను శనీశ్వరుడును అని చెప్పుకుంటూ అద్వితీయంగా కనిపిస్తున్న ఆ నల్లరాయి తనరూపమేనని చెప్పారట.ప్రతిరోజూ పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా ‘తైలాభిషేకం’ చేయమని ఆయన గొర్రెల కాపరికి చెప్పెను.
శనీశ్వరుని దర్శనం అయినా తరువాత తిరిగి వెనక్కి చూడకూడదు . శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడని నమ్మిక. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెబుతారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ నమ్మకం. ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.