BigTV English

Manikaran : ఆ పుణ్యక్షేత్రంలో రెండు మతాల దేవుళ్లు

Manikaran : ఆ పుణ్యక్షేత్రంలో రెండు మతాల దేవుళ్లు

రెండు మతాల భక్తులకి ఆ ప్రాంతమంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే అక్కడ రెండు వేర్వేరు మతాలకు దేవుళ్లు కొలువుదీరిన ప్రాంతం. పరమశివుడూ, గురునానక్‌ ఒకే చోట కొలువైన పుణ్యక్షేత్రం మణికరణ్ ‌. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుకి 40 కిలోమీటర్ల దూరంలో ప్రాంతం ఉంది. పార్వతీ లోయ అని పిలిచే ఆ ప్రాంతం బియాస్‌, పార్వతీ నదుల మధ్యలో ఉంటుంది. మణికరణ్ లోని వేర్వేరు ఆలయాల్లో శివుడు, రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి పూజలందుకుంటారు. మరోపక్క గురునానక్‌ కొలువుదీరిన గురుద్వార్‌ ఉంటుంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు సందర్శించే మణికరణ్ లో వేడినీటి బుగ్గలు ఓ అద్భుత సృష్టి. ఎముకలు కొరికే చలిలో సైతం ఆ బుగ్గల్లోని నీళ్లు పొగలు కక్కుతాయి.


బిందెల్లో బియ్యం వేసి ఎసరు పోసి ఆ నీళ్లలో ఉంచితే నిమిషాల్లో అన్నం ఉడుకుతుంది. పప్పు కూడా ఉడికిపోతుంది. అలా వండిన వంటకాలనే గురుద్వార్‌లో నిత్యం గురు నానక్‌కు నైవేద్యంగా పెడతారు. లంగరులో అన్నదానానికీ అలా వండిన అన్నమే ఉపయోగిస్తారు. మరో బుగ్గలో భక్తులు స్నానమాచరిస్తారు. ఆ వేడి నీళ్లల్లో స్నానం చేస్తే చర్మవ్యాధులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు, ఆ వేడి నీటి మర్మం వెనక శివపార్వతుల మహత్యం ఉందని హిందువులు నమ్ముతుంటారు. అదంతా గురునానక్‌ మాయ అని సిక్కులు విశ్వసిస్తారు.అయితే ఆ లోయలో జియోథర్మల్‌ ఎనర్జీ కారణంగా భూమి కింద రాళ్లు వేడెక్కడంతో బుగ్గల్లో నీళ్లు కూడా వేడిగా వస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చేశారు.


Related News

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Big Stories

×