Dharma Sandehalu:మనం జ్ఞానంతో తిట్టినా…అజ్ఞానంతో తిట్టినా ఫలిస్తుంది. పూర్వం రోజుల్లో ఏదైనా అంటే నీ నోట్ల బెల్లం గడ్డ కొట్టా అనే వారు. ఓరి నీ ఇల్లు బంగారం కాను ఇలాంటి మంచి మాటలే నోటి నుంచి వచ్చేవి. ఒక చెడ్డ మాట నోటి నుంచి వచ్చేవి కాదు. వాళ్లు మాటల్లో అంతటి ఆప్యాయతను చూపించే వాళ్లు. ఒకవేళ అమ్మమ్మ, నాయనమ్మ, పెద్దమ్మ ఇలా ఎవరైనా విషయంలో ఏదైనా తప్పు చేస్తే వెంటనే క్షమించమని అడిగేవారు. మహాభారతంలో కదురు అనే మహిళ విపరీతమైన కోపం వచ్చిన సమయంలో జనమేయజయుడు చేయబోయే సర్పయాగంలో పడి చావాలని కౌరవుల్ని శపించింది. కోపం తారాస్థాయికి వెళ్లినప్పుడు ఏం మాట్లాడుతున్నామో..ఏం చేస్తున్నాయో తెలియదు. ఎవరిని తిడుతున్నామో తెలియదు..ఎవరిని శపిస్తున్నామో బుద్ధికి కూడా తెలియదు . కదురు కూడా అలాంటి పరిస్థితుల్లోనే శపించింది. ఆ శాపం ప్రకారం ఆ నూరుగురు చనిపోయారు
నిజమైన తల్లి ఎవరు అంటే పిల్లలు తప్పు చేస్తే చూపులతో మందలించాలి. అవసరమైతే చేతితో ఒక దెబ్బ కూడా కొట్టచ్చు. మందలించడం తప్పు కాదు. కాని నోటితో అనకూడదు. వాక్కు ఆత్మ శక్తి ద్వారా ప్రచోదితమై బయటకి వస్తే ఫలించే అవకాశం ఉంటుంది. పిల్లలపై ఒట్టు పెట్టి చీటిమీటిగా మాట్లాడుతూ ఉండటం కూడా మంచిది కాదు. ఇష్టకరంగా గర్భం నుంచి బయటకి వచ్చిన వాళ్లను నోటితో తిట్టకూడదు. తల్లి మాట శాపం అంటారు. తల్లితో చెడ్డ మాటలు అనిపించకూడదు. ఎందుకంటే తల్లి బిడ్డకు ప్రధమ దైవం. ఆమె పూజ్యురాలు . ఆరాధించదగ్గ వ్యక్తి. దేవుడి వరమిచ్చినా అలాగే అవుతుంది. శాపమిచ్చినా అదే జరుగుతుంది. జ్ఞానంతో తిట్టినా…అజ్ఞానంతో తిట్టినా ఫలించి తీరుతుంది. కాబట్టి అలాంటివి అనరాదు.
తల్లిదండ్రులను మాటల్ని గౌరవించాలని అని అందుకే. వారిని నొప్పించే పనులు చేయకూడదని అంటారు. ఏదైనా చేయాల్సి వస్తే వారికి నచ్చ చెప్పి ముందుకెళ్లాలని పెద్దలు అంటారు.