Buddhism: ఈ భూమ్మీద జన్మించిన ప్రతి మనిషి ప్రతి క్షణం.. తన మనసులో 5 విషయాలను ఎప్పుడూ మననం చేసుకోవాలని గౌతమ బుద్ధుడు బోధించాడు. అదే.. ‘అంగుత్తరనికాయ’గా పేరొందింది. ఆ 5 అంశాలు..
ఏదో రోజున నాకు అనారోగ్యం తప్పదు. దాన్ని నేను తప్పించుకోలేను.
ఏదో ఒక రోజున నాకు వృద్ధాప్యం వస్తుంది. దాన్నుంచి తప్పించుకోవటం నాకు సాధ్యం కానిపని.
ఏదో రోజున నన్ను మృత్యువు కబళిస్తుంది. దానినీ నేను ఆపలేను.
నేను అమితంగా ప్రేమించి, నావి అనుకుంటున్న ఆస్తిపాస్తులన్నీ ఏదోరోజున నన్ను విడిచి వెళ్లేవే. అవి ఎప్పటికీ నా వద్దే ఉండేలా నేను చేయలేను.
నా కర్మ ఫలితంగానే నేను ఉన్నాను. నేను చేసే మంచి, చెడు పనులకు నేను బాధ్యత వహించాల్సిందే. ఈ అంగుత్తరనికాయ మూలంగా మనిషి.. అహంకారాన్ని వీడి.. సాటి మనుషులను ప్రేమించగలడని బుద్ధుడు బోధించాడు. తానూ మిగిలిన మనుషుల వంటి వాడినేనే భావన మనసులోకి వస్తే.. మనిషి స్వార్థాన్ని, దుర్మార్గపుటాలోచనలకు దూరంగా ఉండగలుగుతాడని గౌతముడు భావించాడు.