Bhojanam:ప్రతి పనికీ ఓ పద్ధతి అనేది వుంటుందని పెద్దలు చెపుతుంటారు. వాస్తు శాస్త్రంలో, కొన్ని దిశలను శుభప్రదంగా పరిగణిస్తారు. కొన్ని పనులకు కొన్ని దిశలు అశుభంగా పరిగణిస్తారు. అలాగే భోజనం చేయడానికీ ఓ క్రమం వుంది. మనం చేసే భోజనంలో వివిధ రకాలైన ఆహార పదార్థాలుంటాయి. ఈ ఆహారాన్ని ఏ వైపు కూర్చుని తినాలన్న విషయాన్ని పెద్దలు ఎప్పుడో చెప్పారు. పూర్వకాలంలో పీటలు వేసుకుని కూర్చుని భుజించేవాళ్లు. కానీ ఈ ఆధునిక కాలంలో డైనింగ్ టేబుళ్లు అవీ అంటూ ఏ దిశలో కూర్చుంటున్నామో కూడా తెలియని పరిస్థితి టేబుల్ను కూడా సరైన దిశలో అమర్చుకుని తింటే మనకు శుభాలు జరుగుతాయి.
తూర్పు దిక్కు
ఈస్ట్ ఫేసింగ్ లో ముఖం పెట్టి భుజించడం ద్వారా ఆయుష్షు పెరుగుదల
పడమర
ఈదిక్కున కూర్చుని భుజిస్తే ఇంట్లోని సామాను వృద్ధి చెందుతుందట.
ఉత్తరం
నార్త్ ఫేసింగ్ లో చూస్తూ కూర్చుని భుజించరాదు. ఆ వైపు ముఖం పెట్టి భుజిస్తే సర్వ అరిష్టాలతో పాటు అనారోగ్యాలు వెన్నంటే ఉంటాయట.
దక్షిణం
సౌత్ ఫేసింగ్ లో కూర్చుని భుజిస్తే పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. ఏ కార్యము తలపెట్టినా విజయాలే కలుగుతాయట.
మంచం మీద భోజనం చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. . ఎల్లవేళలా నేలపై ఆహారం తీసుకోవడం శాస్త్రానికి , ఆరోగ్యానికి రెండింటికీ మంచిది. రెండు కాళ్లు మడత పెట్టి కూర్చొని అంటే పద్మాసనం వేసుకొని తినడం వల్ల అన్నపూర్ణ దేవి సంతోషిస్తుందట. భోజనం పూర్తైన తర్వాత.. డైనింగ్ టేబుల్ నుండి అన్ని పాత్రలను తప్పనిసరిగా తీసివేయాలి. మీరు తిన్న టేబుల్ లేదా స్థలాన్ని శుభ్రం చేయండి. ఇక భోజనం చేసే టప్పుడు మాట్లాడకూడదు. ప్రశాంతంగా భోజనం చేయాలి.