Anti-Bacterial Floor Cleaner : ఇల్లును శుభ్రం చేసేటప్పుడు డెటాయిల్, లేదా మరో లిక్విడ్ వేసి తుడవడం ఈరోజుల్లో కామన్. కాని పాత రోజుల్లో అలాంటివి ఏవీ ఉండేవి కాదు. కానీ కొన్ని రకాల వస్తువుల్ని నీళ్లలో కలిపి ఇంటిని శుభ్రపరుచుకునే వారు. ముఖ్యంగా ఐదు రకాల వస్తువులను నీళ్లలో కలిపి తుడిస్తే దరిద్ర భాగాలు తొలగిపోయి ఇంటికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. సర్వశుద్ధి అనే ఆకులు నీళ్లలో కలిపి తుడిస్తే సర్వం శుద్ది అవుతాయి. ఇంటికి ఎక్కడెక్కడో తిరిగి వచ్చేవాళ్లు ఉంటారు. బయటి వాళ్లు వస్తుంటారు. అందుకే సర్వశుద్ధి ఆకులను నీళ్లల్లో వేసి తుడిస్తే దరిద్ర బాధలు తొలగిపోతాయి.
ఇల్లంతా శుద్ధి అవుతుంది.
అలాగే ఇంటిని క్లీన్ చేసే నీటిలో పసుపు వేయడం సర్వవిధాలా మంచిది. పసుపు ఇంటికి శుభాన్ని చేకూరుస్తుంది . పసుపు యాంటిబయోటిక్ అన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. పసుపుతో ఎలాంటి క్రిములు ఇంట్లో ఉండవు. అలాగే శుద్ధి వస్తువుల్లో కల్లుప్పు ఒకటి. రాళ్లలాంటి ఉప్పును ఒక చిటికెడు మాత్రమే ఇంటిని శుభ్రం చేసే నీళ్లలో వేయాలి. ఉప్పు చాలా శక్తివంతమైంది. సముద్రం నుంచి ఉప్పు పుడుతుంది. లక్ష్మిదేవి పుట్టింది కూడా అక్కడే. ఉప్పనీళ్లలో వేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
ఇంటికి మేలు వస్తువుల్లో పచ్చ కర్పూరం ఒకటి . లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుల్లో పచ్చ కర్పూరం ఒకటి. తిరుమల వెంకటేశ్వరుడి గడ్డానికి రాసేది కూడా పచ్చ కర్పూరమే. లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టం.అందుకే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కొద్దిగా పచ్చకర్పూరాన్ని పొడి చేసి కొంచెం నీళ్లలో కలిపాలి. వీటితోపాటు గోమూత్రాన్ని కలిపి ఇంటిని శుభ్రం చేస్తే గంగతో పవిత్రం చేసుకున్నట్టే లెక్క. గో మూత్రం మహాశక్తివంతమైందని హిందూ ధర్మం చెబుతోంది. గోమూత్రాన్ని స్వీకరిస్తే కడుపులో ఉండే అల్సర్ లాంటి సమస్యలు పోతాయని పెద్దలు చెబుతున్నారు. ఇంట్లో రజస్వల లాంటిదోషాలు ఉంటే గతంలో గోమూత్రాన్ని చల్లి శుద్ధి చేసుకునే వారు.