Viral Hanuman Statue: భారతదేశంలో ఎక్కడ చూసినా పురాతన కట్టడాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో ముఖ్యంగా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఎక్కువ మొత్తంలో ఆలయాలు భారతదేశంలోనే ఉంటాయి. హిందూ సంప్రదాయం ప్రకారం పూర్వ కాలం నుంచి దేవుళ్లను పూజించడం జరుగుతుంది. ఈ తరుణంలో మతాలు, కులాలు, ప్రాంతాలను బట్టి ఒక్కో దేవుడిని పూజిస్తుంటారు. అందులో ముఖ్యంగా దేశం అంతటా కొన్ని ప్రాంతాల్లో వివిధ రకాల దేవుళ్లు ఉన్నా కూడా అందరూ కలిసి కొన్ని దేవుళ్లను ఎంతో భక్తి, శ్రద్ధలతో పూజిస్తుంటారు. ముఖ్యంగా శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీ కృష్ణుడు, శివుడు, జగన్నాథుడు వంటి దేవుళ్లకు దేశ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఉన్నారు.
కేవలం భారత దేశంలోనే కాకుండా హిందూ దేవుళ్ల ప్రాముఖ్యత ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. విదేశాల్లో స్థిరపడే భారతీయులకు అందుబాటులో ఉండేలా వివిధ దేవుళ్ల ఆలయాలు కూడా విదేశాల్లో నిర్మిస్తున్నారు. ఈ మేరకు తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో బజరంగ బలి భారీ విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. టెక్సాస్ లోని హ్యుస్టన్ నగర పరిధిలోని అష్టలక్ష్మీ దేవాలయ ప్రాంగణంలో హనుమంతుడి భారీ విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. ఏకంగా 100 అడుగులు ఉండే భారీ విగ్రహాన్ని విదేశంలో ప్రతిష్టాపించడం అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈ మేరకు అమెరికాలో స్థాపించిన ఈ 100 అడుగుల విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్(ఎస్ఓయూ) పేరిట ప్రతిష్టాపించారు. ఈ తరుణంలో హిందువుల సంప్రదాయం ఉట్టిపడేలా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు దాదాపు నాలుగు రోజుల పాటు విగ్రహానికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించే సమయంలో ఎంతో మంది అతిథులను కూడా ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు భారత దేశం, విదేశాల్లో స్థిరపడిన వేల మంది భారతీయులు తరలివచ్చారు. అంతేకాదు విగ్రహావిష్కరణ సమయంలో హెలికాప్టర్లో పూల వర్షం కురిపించారు.
పూల వర్షం కురిపిస్తూ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టాపించి, జై వీర హనుమాన్ అంటూ నామస్మరణ చేశారు. ఈ తరుణంలో విదేశాల్లో ప్రతిష్టాపన చేసిన మొట్టమొదటి అతిపెద్ద హనుమాన్ విగ్రహంగా అందరినీ ఆకర్షిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఎక్స్ లో వైరల్ అవుతోంది.
అమెరికాలోని టెక్సస్లో 100 అడుగుల వీరాంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
ప్రతిష్ఠాపన సందర్భంగా భక్తులు హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు.
ఈ విగ్రహానికి "స్టాచ్యూ ఆఫ్ యూనియన్" అని నామకరణం చేశారు. pic.twitter.com/tj7jKH0l3x
— greatandhra (@greatandhranews) August 20, 2024