UP woman: వారిద్దరు భార్యాభర్తలు.. పెళ్లై మూడేళ్లు అయ్యింది. ఏం జరిగింది.. ఏమైందో ఎవరికీ తెలీదు. ఆ మహిళ కనిపించలేదు. ఆ తర్వాత కేసులు.. కోర్టులు.. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు గుట్టు బయటపడింది. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్నట్లు తేలింది. మరి న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతోందనేది అసలు ప్రశ్న. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలో వెలుగు చూసింది.
ఉత్తరప్రదేశ్కు చెందిన 23 ఏళ్ల కవితకు 2017, నవంబర్ 17న మ్యారేజ్ అయ్యింది. దడ్వా బజార్కు చెందిన విజయ్ కుమార్తో పెద్దలు పెళ్లి చేశారు. మూడేళ్ల వరకు ఈ దంపతుల కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలీదు. కరెక్ట్గా కరోనా సమయంలో ఆ ఇల్లాలు కనిపించలేదు.
దీంతో కవిత పుట్టింటివారు.. అత్తింటివారిపై ఆరోపణలు గుప్పించడం, ఆపై పోలీసులను ఆశ్రయించడం జరిగింది. చివరకు కేసు సైతం నమోదు అయ్యింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో ఇరు కుటుంబాలు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. న్యాయస్థానం వరకు వెళ్లింది. న్యాయస్థానం ఆదేశాలతో మళ్లీ రంగంలోకి దిగారు పోలీసులు. ఇంతకీ కవిత ఎక్కడ ఉందనేది అసలు ప్రశ్న.
ఎట్టకేలకు కవిత ఆచూకీ కోసం చాలా సమయం పట్టింది. లక్నోకు చెందిన సత్యనారాయణ గుప్తా.. గోండాలోని ఓ మార్కెట్లో షాపు నిర్వహిస్తున్నాడు. మ్యారేజ్ తర్వాత ఆయనతో కవితకు ఎప్పుడు పరిచయం ఏర్పడింది. అది వీరిద్దరి మధ్య ప్రేమగా మారింది. ఈ క్రమంలో వివాహ బంధాన్ని ఎగతాళి చేసింది కవిత. ఎవరికీ చెప్పకుండా ప్రియుడితో వెళ్లిపోయిందని పోలీసుల విచారణలో బయటపడింది.
ALSO READ: ఇళ్ల మధ్య భారీ పేలుడు.. ముగ్గురు మృతి..
తొలుత ప్రియుడితో కలిసి అయోధ్యలో కొద్దిరోజులు ఉంది కవిత. ఆ తర్వాత అక్కడి నుంచి లక్నోకు మకాం మార్చారు. చివరకు అన్నికోణాల్లో విచారణ చేసిన పోలీసులు కవితను అరెస్ట్ చేశారు. నేడో రేపో ఆమెని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. మరి న్యాయస్థానం తీర్పు ఏవిధంగా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.