Travels Bus Accident in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదాలతో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. అదే సమయంలో నిర్మల్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఓ ప్రైవేటు ట్రావెల్స్ వోల్వో బస్సు బోల్తా పడి ఇద్దరు పిల్లలు చనిపోయిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 35 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తుండగా.. బస్సు లోపల చిక్కుకున్న మరికొందరు ప్రయాణీకులను స్థానికులు బయటికి తీసి రక్షించారు. హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. గాయపడిన వారిని కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి అతి వేగమే కారణమా లేక నిద్రమత్తా అనే కోణంలో విచారణ చేపట్టారు.
Also Read: నెల్లూరులో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే!!
కాగా.. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహబూబ్ ఘాట్ పై మస్కాస్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన జరిగే సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి.
ఒకరు మాత్రం అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ట్రావెల్ బస్సు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా.. ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేసే తరుణంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.