EPAPER

Students Died: కైలాసపట్నం అనాధల పాఠశాలలో విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి

Students Died: కైలాసపట్నం అనాధల పాఠశాలలో విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి

Kailasapatnam Church Orphans School Students Died: అనకాపల్లి జిల్లా కోటవుట్ల మండలం కైలాసపట్నంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో ఒక అనాధల పాఠశాల రన్ అవుతోంది. ఆ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 86 మంది పిల్లలు ఉండగా.. వారిలో 27 మంది విద్యార్థులు నిన్న ఉదయం అస్వస్థతకు గురయ్యారు. వారికి వాంతులు, విరేచనాలు కావడంతో సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వారిని డిశ్చార్జ్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంటికి వెళ్లిన విద్యార్థుల్లో.. ముగ్గురు మరణించారు. చికిత్స పొందుతూ మరో విద్యార్థి కూడా మరణించడంతో.. మృతుల సంఖ్య 4కి చేరింది.  ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో.. డిప్యూటీ డీఈఓ విచారణకు ఆదేశించారు. స్కూల్ లో ఫుడ్ పాయిజన్ జరగడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురై ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిర్యానీ తయారు చేసిన 24 గంటల తర్వాత తినడం వల్లే ఇలా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. నలుగురు విద్యార్థుల మృతితో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 


 

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×