మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి శివారులో దుండిగల్ విమానాశ్రయం కు సంబంధించిన శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘటన సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో జరిగింది. కూలిన విమానం పూర్తిగా కాలిపోవడంతో.. అందులో ఉన్న ఇద్దరు పైలట్లు మరణించారని పోలీసులు వెల్లడించారు.
తూప్రాన్ సమీపంలోని రావెల్లి కొండల్లో శిక్షణ విమానం కూలిపోయింది. ఆ సమయంలో పెద్ద శబ్ధం రావడంతో సమీపంలో పనిచేస్తున్న రైతులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే విమానం పూర్తిగా కాలిపోవడంతో.. స్థానికులు మంటలను ఆర్పేందుకు ముందుకు వెళ్లలేకపోయారు.
కాగా.. హెలికాప్టర్ లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానాన్ని దుండిగల్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన శిక్షణ విమానంగా పోలీసులు గుర్తించారు. సాంకేతిక లోపం కారణంగానే శిక్షణ విమానం కూలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.