EPAPER

Telugu doctor: అమెరికాలో తెలుగు డాక్టర్ అనుమానాస్పద మృతి

Telugu doctor: అమెరికాలో తెలుగు డాక్టర్ అనుమానాస్పద మృతి

Telugu doctor died in america: అమెరికాలో తెలుగు డాక్టర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని మేనకూరుకు చెందిన పేరంశెట్టి రమేశ్ బాబు(68)ని కొంతమంది దుండుగులు కాల్చి చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


వివరాల ప్రకారం..తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించిన ఆయన..జమైకాలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డాడు. ఆయనతోపాటు భారయ కూడా అక్కడే వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులుండగా.. వారు అక్కడే ఉంటున్నారు.

ఇదిలా ఉండగా, కరోనా సమయంలో రమేశ్ బాబు విశేష సేవలు అందించారు. సేవలకు గానూ ఆయన పురస్కారాలు సైతం అందుకున్నారు. గతంలో తాను చదువుకున్న పాఠశాలకు రూ.14 లక్షల విరాళం అందించారు. అలాగే స్వగ్రామంలో సాయిబాబా ఆలయ నిర్మాణానికి సైతం రూ.20లక్షలు అందించారు. ఇటీవల ఏపీకి వచ్చిన ఆయన..తిరిగి అమెరికా వెళ్లిపోయారు. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబసభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×