Road Accident in Gujarat: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్ ప్రెస్ వేపై బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు అతివేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.
మరోవైపు సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్లు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన ప్రయాణికులకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.