Husband sets house on fire: రానురాను కొందరి మనుషుల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. అటుపై ఆ కోపం ఏ ప్రమాదానికి దారి తీస్తుందో అర్థం కావడంలేదు. ఆ కోపం వల్ల మనో విచక్షణ కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి అడవి జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారో వారికే అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది. ఇందుకు ఉదాహరణ తాజాగా చోటు చేసుకున్నటువంటి ఓ సంఘటన. భార్యాభర్తల మధ్య గొడవ చెలరేగింది. భార్యమీద కోపంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త.. భార్యపై, ఇంటిపై కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు స్వల్వ గాయాలు కాగా, ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామానికి చెందిన ఓ భార్యాభర్తలు శనివారం గొడవపడ్డారు. అంతటితో ఆగకుండా తీవ్ర ఆగ్రహానికి లోనైనటువంటి భర్త.. భార్యపై, ఇంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టాడు. స్థానికులు గమనించి భార్యను కాపాడారు.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం.. సీఎం రేవంత్ స్పెషల్ ట్వీట్
ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు స్వల్ప గాయాలు కాగా, ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలిసి స్థానికులు.. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తన తీరును మార్చుకోవాలంటూ సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.