Maoist Encounter: కరడుగట్టిన మావోయిస్టు మడకం హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మధ్యప్రదేశ్లో జరిగిన ఎన్ కౌంటర్లో అతడిని మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. మడకం హిడ్మా అలియాస్ చైతుపై 14 లక్షల రివార్డ్ ప్రకటించారు పోలీసులు. ఖాంకోదాదర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు హిడ్మా.
ఖాంకోదాదర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో కూంబింగ్ నిర్వహించామని డీఐజీ ముఖేష్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. అయితే ఎదురు కాల్పుల్లో హిడ్మా మృతి చెందినట్టు తెలిపారు. హాక్ ఫోర్స్ టీమ్ ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నారని తెలిపారు. అయితే కాల్పులు సమయంలో అతని సహచరులు పరారయ్యారన్నారు. మావోయిస్టు చైతూ భద్రతా బలగాలపై జరిగిన పలు దాడుల్లో కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు చెబుతున్నారు.