Delhi Police Register FIR on Who Comments on Captain Anshuman Wife: దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడు అంశుమన్సింగ్ త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం కీర్తి చక్ర అవార్డు ప్రకటించింది. ఆయన వైఫ్ స్మృతిసింగ్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇంతవరకు బాగానే ఉంది.. కొందరు వ్యక్తులు ఆ వీడియోపై అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారు. ఢిల్లీకి చెందిన అహ్మద్ అనే వ్యక్తి అసభ్యకరంగా చేయడంపై నెటిజన్స్ భగ్గుమన్నారు. చివరకు జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన నెటిజన్ ఖాతా డీటేల్స్ సంబంధిత సోషల్మీడియా సంస్థ నుంచి తీసుకున్నా రు. ఆ వ్యక్తి రేపో మాపో అరెస్టు చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే ఆ వ్యక్తి ఫోన్, సోషల్ మీడియాపై ఢిల్లీ పోలీసులు ఓ కన్నేశారు.
Also Read: Ramsetu : సముద్రగర్భంలో రామసేతు వంతెన.. ఫొటోలు రిలీజ్ చేసిన ఇస్రో
ఇదిలావుండగా కోడలు స్మృతిసింగ్పై అత్తమామలు తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రం అందించిన కీర్తి చక్ర అవార్డును తమ కోడలు తీసుకుపోయిందని ఆరోపించారు. కనీసం అవార్డును తాము తాకే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కుమారుడి దిన కర్మ తర్వాత కోడలు వెళ్లిపోయిందన్నారు.
అంశుమన్ అమరుడు అయ్యాక కోడలు తమతో ప్రవర్తించిన తీరు చాలా బాధ కలిగిందన్నారు. ఇప్పుడు స్మృతి కనీసం మాట్లాడడలేదన్నారు. అవార్డును కొడుకు ఫోటో దగ్గర ఉంటుందని తాము భావించామని, అవార్డు అందుకున్న తర్వాత కోడలు తన దారి తాను వెళ్లిపోయిందని బోరున విలపించారు మంజుదేవి, రవిప్రతాప్ దంపతులు.