Biker Rapes Degree Student in Bengaluru: కలకత్తాలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం తర్వాత.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో యువతులు, మైనర్లపై సామూహిక అత్యాచారాలు, అత్యాచారం జరిగాయి.. జరుగుతున్నాయి. ఇలాంటి ఘటన యావత్ దేశాన్నీ కలచివేస్తే.. అందుకు కారణమైన నిందితుడిని ఎలా శిక్షించినా.. కామాంధుల ఆలోచనల్లో మార్పు మాత్రం రావట్లేదు. అదే ఉంటే.. నిర్భయ ఘటన తర్వాత పన్నెండేళ్లకు నిందితులకు ఉరిశిక్ష పడింది. ఆ తర్వాతైనా ఆడపిల్లల్ని చూసే తీరులో మార్పు రావాలి. కానీ.. మరింత రెట్టింపయ్యాయి. మహా అయితే చంపేస్తారు.. అంతే కదా అన్నట్లుంది కామాంధుల తీరు. వారికి కావలసింది ఒక్కటే.. ఆ సమయానికి వారి కామవాంఛ తీరిందా లేదా.. అంతే.
డెహ్రాడూన్ లో మైనర్ పై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. బెంగళూరులోనూ ఓ యువతిపై బైకర్ అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతి.. కోరమంగళలో జరిగిన గెట్ టు గెదర్ పార్టీకి వెళ్లి తిరిగి హెబ్బగోడిలోని తన ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో యువతిని ఓ వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకున్నాడు. సరేనని అతడిని నమ్మి బైక్ ఎక్కడమే ఆమె పాలిట శాపమైంది.
Also Read: బస్సులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఐదుగురు అరెస్ట్
ఆమెను బెదిరించి లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి.. రికార్డుల్లో రేపిస్ట్ గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేసి.. ఆమె బంధువులతో మాట్లాడారు. నేరస్తుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.