Chain Snatchers : వృద్ధురాలు ఒంటరిగా ఉండడం గమనించిన ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి ఆమె మెడలో నుంచి ఐదు తులాల బంగారు నగలు, పది వేల నగదును అపరించుకుపోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ ప్రాంతానికి చెందిన గోపు గంగమ్మ ఇంట్లో చోటుచేసుకుంది.
ఒంటరిగా కూర్చొని ఉండగా గుర్తుతెలియని దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు. వృద్ధురాలిని గదిలో బంధించాడు. వృద్ధురాలి మెడలో ఉన్న సుమారు ఐదు తులాల బంగారు నగలు, పదివేల నగదును అపరించుకొని వెళ్ళిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని టౌన్ నరహరి, ఎస్సై అశోక్ పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.