EPAPER

Road Accident: మహబూబ్ నగర్లో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Road Accident: మహబూబ్ నగర్లో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Road Accident in Mahabub Nagar: మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. భూత్పూర్ మండలం తాటికొండ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎం ను ఢీ కొట్టిన కారు.. దాని కిందికి చొచ్చుకుని వెళ్లింది.


Also Read: మాచర్లలో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై తండ్రి ఘాతుకం

ప్రమాదంలో కారు ముందు భాగమంతా నుజ్జునుజ్జవ్వగా.. అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా తిరుపతి నుంచి కర్నూల్ మీదుగా హైదరాబాద్ కు వెళ్తుండగా.. మధ్యలో బైక్ ను తప్పించబోయి డీసీఎంను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మృతులంతా హైదరాబాద్ కు చెందినవారిగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలిసిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×