Accident in ELURU Three members died: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు.
రెప్పపాటులో మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల సమీపంలోని శ్రీలక్ష్మీనగర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ తోపాటు ఇద్దరు మృతి చెందారు. గాయపడిన బాలుడికి చికిత్స అందిస్తున్నారు. వీరంతా విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు వెలికితీశారు. అనంతరం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Share