EPAPER

Accident in AP: ఏలూరులో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Accident in AP: ఏలూరులో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
Accident in ELURU Three members died: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు.
రెప్పపాటులో మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల సమీపంలోని శ్రీలక్ష్మీనగర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ తోపాటు ఇద్దరు మృతి చెందారు. గాయపడిన బాలుడికి చికిత్స అందిస్తున్నారు. వీరంతా విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు వెలికితీశారు. అనంతరం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Tags

Related News

Florida Woman Buried Husband: ‘దృశ్యం’ సినిమా లాంటి కేసు.. భర్త శవాన్ని ఇంట్లో పాతిపెట్టిన మహిళ.. హత్య మరెవరో చేసి..

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Big Stories

×