EPAPER

Xiaomi letter to India: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు భయపడుతున్నాయ్.. కేంద్రానికి షావోమి లేఖ!

Xiaomi letter to India | చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ విడిభాగాల కంపెనీలు భారతదేశంలో తయారీ యూనిట్లు పెట్టడానికి భయపడుతన్నాయని ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షావోమి కేంద్రానికి తెలిపింది.

Xiaomi letter to India: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు భయపడుతున్నాయ్.. కేంద్రానికి షావోమి లేఖ!
Xiaomi letter to India

Xiaomi letter to India:


చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ విడిభాగాల కంపెనీలు భారతదేశంలో తయారీ యూనిట్లు పెట్టడానికి భయపడుతన్నాయని ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షావోమి కేంద్రానికి తెలిపింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో స్మార్ట్ ఫోన్ విడిభాగాల తయారీ ఫ్యాక్టరీలు స్థాపించాలని భావించి.. అందుకు షావోమి కంపెనీని సంప్రదించింది.

దేశంలోనే స్మార్ట్ ఫోన్ విడిభాగాలు తయారు చేయడానికి ప్రభుత్వం ఎటువంటి సహాయం కావాలో తెలపాల్సిందిగా షావోమి అధికారులను ప్రశ్నించింది. దీనికి సమాధానంగా షావోమి ఇండియా ప్రెసిడెంట్ మురళికృష్ణన్.. కేంద్ర ఐటి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.


ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోయే స్మార్ట్ ఫోన్ అయిన షావోమీ ఇండియా కేంద్రం అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. దేశంలో స్మార్ట్ ఫోన్ విడిభాగాల తయారు చేసే కంపెనీలకు ప్రోత్సకాలు ఇవ్వాలని, ప్రత్యేక విడిభాగాల దిగుమతిపై పన్నులు తగ్గించాలని సూచిస్తూ.. గత కొంతకాలంగా భారత ప్రభుత్వం చైనా కంపెనీలపై విచారణ చేస్తున్న సందర్భంగా చైనా కంపెనీలు ఇండియాలో ఫ్యాక్టరీలు స్థాపించడానికి భయపడుతున్నాయని తెలిపింది. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడడం లేదని షావోమి ఇండియా ప్రెసిడెంట్ మురళికృష్ణన్ అన్నారు.

2020లో ఇండియా, చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని చైనా కంపెనీలపై విచారణ చేపట్టింది. ఆ తరువాత చైనా నుంచి దిగుమతి అయ్యే స్మోర్ట్ ఫోన్ కీలక విడిభాగాలపై పన్నులు పెంచేసింది. చైనా కంపెనీలకు వ్యాపార లైసెన్సుల విషయంలో నియమాలను కఠినతరం చేసింది. ఆ తరువాత నుంచే చైనా కంపెనీల అధికారులకు భారత వీసా దొరకడం కష్టంగా మారింది.

ఈ విషయాన్ని షావోమి ఇండియా తన లేఖలో ప్రస్తావిస్తూ.. చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలతో చర్చలు జరిపి.. వారికి ఇండియాలో విడిభాగాల తయారీకి సహకారం అందిస్తామనే నమ్మకం కలిగించాలని సూచించింది.

2023లో చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వీవో టెక్నాలజీ నిబంధనలు అతిక్రమించి 13 బిలియన్ డాలర్లు చట్టవ్యతిరేకంగా చైనాకు తరలించిందనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. అలాగే షావోమీకి సంబంధించిన 600 మిలియన్ డాలర్లను భారత ప్రభుత్వం సీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీలు చట్టవ్యతిరేకంగా నిధులు సరఫరా చేస్తున్నాయని భారత అధికారులు తెలిపారు.

Xiaomi, letter, India, China, smartphone, manufacturing units, Incentives,

Related News

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతం పెంపు.. హర్యాణా ఎన్నికల ముందు బిజేపీ మాస్టర్ ప్లాన్!

Car Discounts September 2024: ఈ ఎలక్ట్రిక్ కారుపై లక్షల్లో డిస్కౌంట్.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ రాదు బ్రో..!

Vande Bharat: విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ సేవలు రద్దు.. ఈ డీటెయిల్స్ చూసుకోండి

EPS pension Any Bank: ఈపిఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై దేశంలో ఏ బ్యాంకులో నుంచి అయినా పెన్షన్ డ్రా చేయొచ్చు!

TRAI Fake Calls: ఫేక్ కాల్స్ పై కేంద్రం కొరడా.. ఏకంగా 2.75 మొబైల్ నెంబర్లు బ్లాక్!

Rs 2000 Notes:రద్దయ్యాక ఇప్పటివరకూ బ్యాంకులకు చేరిన రెండు వేల నోట్లు ఎన్నో తెలుసా?

Electronics ‘repairability index’: ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు ఇకపై రిపేరెబిలిటీ ఇండెక్స్.. త్వరలో చట్టం తీసుకురానున్న కేంద్రం!

Big Stories

×