Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే రీతిలో కొనసాగాయి. మదుపర్లు ఎక్కువగా షేర్ల అమ్మకాల వైపు మొగ్గుచూపారు. ఈ పరిణామాల మధ్య మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 187.31 పాయింట్లు నష్టపోయి 60,858.43 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57.5 పాయింట్ల నష్టంతో 18,107.85 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.81.33 వద్ద ఉంది.
రిలయన్స్, టీసీఎస్, ఐటీసీ, మారుతి, హెచ్సీఎల్టెక్, హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎమ్ అండ్ ఎమ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీబ్యాంక్, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, టాటా స్టీల్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.