Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా అమ్మకాలకు మొగ్గుచూపారు. మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 220 పాయింట్లు నష్టపోయి 60,286 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 17,721 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ. 82.73 వద్ద ఉంది.
- Advertisement -
బజాజ్ ఫినాన్స్, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ పేర్లు లాభాల్లో ఉండగా.. రిలయన్స్, టైటాన్, ఐటీసీ, టాటా మోటార్స్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, విప్రో, యాక్సిక్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మారుతి షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
- Advertisement -