MG Cloud Ev Launching In India Soon: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ ఆటో మొబైల్ మార్కెట్లో కొత్త కొత్త కార్లను లాంచ్ చేస్తూ తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తోంది. కారు వినియోగదారుల సేఫ్టీకి తగినట్లుగా అద్భుతమైన ఫీచర్లను అందించి ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు కేవలం ధరపైనే ఫోకస్ పెట్టిన వినియోగదారులు ఇప్పుడు ధరతో పాటు సేఫ్టీ విషయంలోను బాగా ఆలోచించి కారును కొనుక్కుంటున్నారు. అందువల్లనే ప్రముఖ కంపెనీలు సైతం సేఫ్టీపై దృష్టి సారించాయి. అందులో ఎంజీ మోటార్ కూడా ఒకటి. ఇక ఇప్పటికే పలు మోడళ్లను మార్కెట్లో రిలీజ్ చేసిన కంపెనీ ఇప్పుడు మరో మోడల్ను టెస్ట్ డ్రైవ్ చేస్తూ దర్శనమిచ్చింది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎంజీ మోటార్ ఇండియా క్రాస్ఓవర్ యుటిలిటీ కారును త్వరలో దేశీయ మార్కెట్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించింది. అయితే టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించడం ఇదేమి మొదటిసారి కాదు.. ఇంతకు ముందు చాలా సార్లు కనిపించింది. కాగా ఇప్పుడు మరోసారి దర్శనమిచ్చింది. దేశీయ రోడ్లపై ఫుల్ కవర్లతో టెస్ట్ డ్రైవ్ చేస్తుంది. ఎంజీ మోటార్ నుంచి త్వరలో మార్కెట్లోకి రాబోతున్న నెక్స్ట్ కారు ఇదే అని తెలుస్తోంది.
అందువల్లనే కంపెనీ ఈ కారు టెస్ట్ డ్రైవ్లను వేగవంతం చేసింది. కాగా ఇది చూడ్డానికి ఎస్యూవీ వెహికల్ కంటే చాలా పెద్దగా కనిపిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ కారు అత్యాధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. ఇది 8.8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ స్క్రీన్, అలాగే ఫ్రీ స్టాండింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఎస్యూవీలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్ గేట్, అలాగే పెద్ద పనోరమిక్ సన్రూఫ్, లెదర్ సీట్లుతో సహా మరిన్ని ఫీచర్లు ఇందులో అందించినట్లు తెలుస్తోంది.
Also Read: టాటా మోటార్స్ ప్లాన్ అదిరింది.. పంచ్, నెక్సాన్, టియాగో ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్స్..!
అయితే ఈ కారు పేరుకు సంబంధించి ఎలాంటి అప్డేట్ను కంపెనీ ఇంత వరకు అందించలేదు. అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. క్లౌడ్ ఈవీగా ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందువల్ల ఎంజీ మోటార్ ఇండియా అతి త్వరలో ఈ కారును దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వెహికల్ 177 పియస్, 280 ఎన్ఎమ్ టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో సేల్కు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఇది 50.3 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్తో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ బ్యాటరీకి ఒక్కసారి ఫుల్గా ఛార్జింగ్ పెడితే ఏకంగా 450 కి.మీ మైలేజీ అందిస్తుందని అభిప్రాయపడుతున్నారు. కాబట్టి లాంగ్ డ్రైవ్ చేసేవారికి ఈ కారు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు.