Pan- Aadhaar Link Deadline: పాన్ కార్డు హొలర్డర్లకు భారత ప్రభుత్వం మరోసారి కీలక సూచన చేసింది. భారత పౌరులకు అతిముఖ్యమైన ఆధార్ , పాన్ కార్డు లింక్ చేయడానికి త్వరలో గడువు ముగియనుంది. ఇప్పటికే ఉచితంగా లింక్ చేసుకునే ప్రక్రియకు సంబంధించిన గడువు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే మే 31వ తేదీ వరకు మరో అవకాశం ఉంది. రూ. 1,000 చెల్లించి పాన్ కార్డు, ఆధార్ లింక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ గడువు ముగిసిన తర్వాత పాన్ కార్డును, ఆధార్తో లింక్ చేయకపోతే పాన్ కార్డు పని చేయకపోవచ్చని తెలుస్తోంది.
మే31 వ తేదీలోపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే ఆ వ్యక్తి పాన్ కార్డు ఇన్ యాక్టివేట్ అవుతుంది. ఈ మేరకు 2024 మార్చి 31 వరకు జరిగిన లావాదేవీలపై పన్ను చట్టం 1961లోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ కింద ట్యాక్స్ కలెక్షన్ జరగదు అని పేర్కొంటూ ఇన్ కంట్యాక్స్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేసింది.
Also Read: Unclaimed Funds in Stock Market: స్టాక్ మార్కెట్లు క్రాష్.. రూ.1.91 లక్షల కోట్లు వెయిటింగ్..
కాగా, పాన్ కార్డును, ఆధార్ కార్డుతో లింక్ చేయడం అనేది తప్పనిసరి. ఒకవేళ పాన్ కార్డు, ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే జీతం, పెట్టుడబుల ద్వారా వచ్చే వడ్డీ ఆధాయాలపై ఎక్కువ టీడీఎస్ కట్ అవుతుంది. అందువల్ల మరో రెండు రోజులే సమయం ఉండడంతో త్వరగా లింక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్ సైట్ ద్వారా లింక్ చేసుకోవాలని సూచించింది. లేదంటే ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ దగ్గర కూడా లింక్ చేసుకోవచ్చు.