EPFO Account : ఇటీవల కాలంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్సేన్స్ ఉపయోగించేవారి సంఖ్య భారీగా పెరిగింది. మరీ ముఖ్యంగా కోవిడ్ సందర్భంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసే వెసులుబాటు కల్పించింది. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రాలు భారీ స్థాయిలో జరిగాయి.
కానీ పీఎఫ్ అకౌంట్లో వివరాలు సరిగ్గా లేకపోవడం వల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ పెండింగ్లో పడుతుంది ఖాతాదారులకి. మరోవైపు ఈపీఎఫ్ఓ ఇ-నామినేషన్ తప్పనిసరిగా ఫైల్ చేయమని కోరుతోంది. పీఎఫ్ అకౌంట్లో వివరాలు తప్పుగా ఉండటం వల్ల ఇ-నామినేషన్ ఫైలింగ్ కూడా చేయలేము.
READ MORE : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లలో స్విగ్గీ ఫుడ్
ఇందులో ముఖ్యంగా ఈపీఎప్ అకౌంట్లో పేరు, పుట్టిన తేదీ, నామినీ లాంటి వివరాలు తప్పుగా ఉన్నాయా? లేదా మీ వివరాలు తప్పుగా ఉన్నందుకు మీరు ఈపీఎఫ్ఓ సేవల్ని వినియోగించలేకపోతున్నారా? అయితే మీకో శుభవార్త చెప్పింది ఈపీఎఫ్ఓ. వినియోగదారులు తమ వివరాలను ఆన్లైన్లోనే సరిచేసుకునే అవకాశం కల్పిస్తోంది ఈపీఎఫ్ఓ. మెంబర్ యూనిఫైడ్ పోర్టల్లో లాగిన్ అయి వివరాలు సరిచేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
READ MORE : భారీగా పెరిగిన బంగారం ధర.. ఆల్ టైమ్ రికార్డు దిశగా పరుగు
ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఇప్పుడు ఉమంగ్ యాప్ని ఉపయోగించి తమ మొబైల్ ఫోన్లలో తమ పీఎఫ్ బ్యాలెన్స్ సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ సభ్యులకు ఒకే ప్లాట్ఫారమ్లో వివిధ ప్రభుత్వ పథకాలు, సేవలకు ప్రాప్యతను అందించడానికి భారత ప్రభుత్వం ఈ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ ఖాతాదారులు ఈపీఎఫ్ పాస్బుక్ చూడొచ్చు. అంతేకాకుండా ఈపీఎప్ క్లెయిమ్ చేసుకోవచ్చు. వినియోగదారుడు మొబైల్ ఫోన్లో ఉమంగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే క్షణాల్లో పీఎఫ్ బ్యాలెన్స్ తెలిసిపోతుంది.