Flipkart Started Bus Ticket Booking Services: దిగ్గజ డిజిటల్ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన వినియోగదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఈ గుడ్ న్యూస్.. తన వినియోగుదారులకే కాకుండా.. దూర ప్రాంతాలకు బస్సులో ప్రయాణించే వారికి తీపి కబురు కానుంది.
తాజాగా ఫ్లిప్కార్ట్ బస్ టికెట్ సేవలను ప్రారంభించింది. అయితే కొద్ది రోజుల పాటు ఎటువంటి అదనపు ఛార్జ్ లేకుండా బస్ టికెట్ బుక్ చేసుకునే వీలు కల్పించింది.
తాజాగా ఫ్లిప్కార్ట్ సంస్థ రాష్ట్ర రవాణా కార్పోరేషన్లు, ప్రైవేట్ అగ్రిగేటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుని పలు రాష్ట్రాల్లో బస్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతానికి బెంగుళూరు, ఛండీగఢ్, ఢిల్లీ, జైపూర్, ఇండోర్, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై, చెన్నైలలో ఈ టికెట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
అయితే బస్ టికెట్ బుక్ చేసుకునేవారు నేరుగా ఫ్లిప్కార్ట్ నుంచి ఎలాంటి ఛార్జీలు లేకుండా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. నూతనంగా ఈ సర్వీసు ప్రారంభించిన నేపథ్యంలో ఈనెల 15వ తేదీ వరకు 20 శాతం వరకు రాయితీని కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది.
Also Read: బోట్ యూజర్లకు షాక్.. ప్రమాదంలో 75 లక్షల మంది డేటా..
దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా రూట్లలో 10 లక్షలకు పైగా బస్సులకు సంబంధించిన టికెట్ బుకింగ్ సేవలను అందించడమే తమ లక్ష్యంగా పెట్టుకుని ఫ్లిప్కార్ట్ ఈ సర్వీసును ప్రారంభించినట్లు తెలిపింది. అయితే ఫ్లిప్కార్ట్ ఇప్పటికే విమాన టికెట్, హోటల్ బుకింగ్ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.