Business News Stock Market Rally Today Opening: ఓ వైపు ఏపీ, తెలంగాణలో ఎలక్షన్ల హీట్ పెంచుతూ, కంటిమీద కునుకులేకుండా చేస్తుంటే..మరోవైపు స్టాక్ మార్కెట్లు దివాల తీసి ఇన్వెస్టర్లకు బిగ్ షాక్ ఇచ్చాయి. జూన్ 4, 2024న జరగుతున్న ఎన్నికల ఫలితాల కోసం సామాన్య ప్రజలతో పాటు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో నేడు స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో స్టార్ట్ అయ్యాయి.మధ్యాహ్నం నాటికి సెన్సెక్స్ 6,000 పాయింట్లు, నిఫ్టీ 2,000 దిగువకు పడిపోయి అందరికి ఊహించని భారీ షాక్ని ఇచ్చాయి.ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో స్టార్ట్ అయ్యాయి.లోక్సభ ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభం కావడంతో దేశీయ బెంచ్మార్క్ సూచీలు మంగళవారం గ్యాప్ దిగువకు ప్రారంభాన్ని చూశాయి. ఇది ఇండియా బ్లాక్కు ఊహించిన దానికంటే మెరుగైన పనితీరును సూచిస్తుంది. ఈరోజు దలాల్ స్ట్రీట్లో మదుపర్లు సేల్స్ వైపు మొగ్గుచూపుతున్నారు.