Bigg Boss 8 Telugu : మునుపటి సీజన్స్లో ఎప్పుడూ లేనంతగా బిగ్ బాస్ 8లో ఒకేసారి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ప్రవేశపెట్టారు. గత సీజన్లో ఒకేసారి అయిదు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాగానే మరీ ఇంతమంది వచ్చారేంటి అనుకున్నారు ప్రేక్షకులు. అలాంటిది ఈ సారి ఏకంగా ఎనిమిది మంది రావడం అందరికీ షాకింగ్ అనిపించింది. అయితే బిగ్ బాస్ 8లో ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీల విషయం చాలాకాలం క్రితమే బయటికొచ్చింది. దీంతో ప్రస్తుతం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ వల్ల ఎంటర్టైన్మెంట్ రావడం లేదు కాబట్టి కొత్తవారిని రంగంలోకి దించుతున్నారని ప్రేక్షకులు అనుకున్నారు. మొత్తానికి ప్రేక్షకుల అంచనాలతో పాటు మేకర్స్ అంచనాలు కూడా తారుమారయ్యాయి.
తెలిసినవాళ్లే…
బిగ్ బాస్ 8లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా రాగానే షో రాత మారుతుందని అనుకున్నారంతా. కానీ మునుపటి సీజన్స్లో చూసిన కంటెస్టెంట్స్నే మళ్లీ తీసుకొచ్చి వారితోనే ఆటలు ఆడించడం మొదలుపెట్టారు బిగ్ బాస్. ఈ ఎనిమిది మంది బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉన్నారో, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో, వారి స్ట్రాటజీలు ఎలా ఉంటాయో అన్నీ ప్రేక్షకులకు తెలుసు. కనీసం ఇప్పుడైనా కొత్త స్ట్రాటజీలతో హౌస్లో అడుగుపెట్టారా అనుకుంటే.. వారి ప్రవర్తన చూస్తే అలా లేదు. దీంతో బిగ్ బాస్ 8ను వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా కాపాడలేకపోయాయని, ఇకపై ఎవరూ కాపాడలేరు అని కూడా ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు.
Also Read: బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ కనిపించలేదు.. షాక్ లో ఆడియన్స్..
ప్రోమోల్లో మాత్రమే…
బిగ్ బాస్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కొత్తగా ఉంటాయనుకుంటే చెత్తగా తయారయ్యాయి. వారి వల్ల చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ప్రోమోల్లో చూపించడమే తప్పా ఎపిసోడ్లో మాత్రం అంత ఎంటర్టైన్మెంట్ కనిపించడం లేదు. అవినాష్, రోహిణి వంటి కంటెస్టెంట్స్ తమవంతు ఎంటర్టైన్మెంట్ అందించడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడప్పుడు హరితేజ కూడా వారికి యాడ్ అవుతుంది. ఈ ముగ్గురు కాకుండా మరెవరూ కూడా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించే కేటగిరిలో లేరు. ముఖ్యంగా మళ్లీ ఆ పాత మొహాలను చూడడానికి ఆడియన్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బిగ్ బాస్ 8 ప్రారంభమయినప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ అంతా కొత్త మొహాలు అని కంప్లైంట్ చేసిన ప్రేక్షకులు.. వైల్డ్ కార్డ్స్ తర్వాత పాత మొహాలనే చూడాలా అని అనుకుంటున్నారు.
వాళ్లెందుకు వచ్చారో…
మునుపటి సీజన్స్తో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. మామూలుగా ఒక సీజన్ ప్రారంభమయ్యి సగం రోజులు గడిచిన తర్వాత బయట ఏర్పడే ఫ్యాన్ బేస్ను బట్టి విన్నర్ ఎవరో ఈజీగా గెస్ చేయవచ్చు. కానీ సీజన్ 8లో మాత్రం అలా జరగడం లేదు. చూసే ప్రేక్షకుల సంఖ్య తక్కువ అవ్వడంతో ఓట్లు కూడా తక్కువగానే వస్తున్నాయి. దీంతో అసలు బిగ్ బాస్ 8లో విన్నర్ ఎవరు అవుతారు అనే విషయంపై క్లారిటీ లేదు. ఈసారి వచ్చిన వైల్డ్ కార్డ్స్లో మరోసారి గంగవ్వను కంటెస్టెంట్గా తీసుకురావడం చాలామంది ప్రేక్షకులకు నచ్చడం లేదు. అలాగే నయని పావని కూడా గ్లామర్ షో చేయడానికే వచ్చింది తప్పా గేమ్ మీద అసలు ధ్యాస లేదని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.