Bigg Boss 8 Telugu Latest Updates: ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్లో ముగ్గురు చీఫ్లు ఉన్నారు. వాళ్లే నిఖిల్, నైనికా, యష్మీ. టీమ్స్ ప్రకారం చూస్తే నైనికా, యష్మీ టీమ్లో సమానంగా సభ్యులు ఉన్నారు కాబట్టి వారిద్దరిలో ఎవరు స్ట్రాంగ్ అని తెలుసుకోవడానికి బిగ్ బాస్ పోటీ మొదలుపెట్టాడు. ఇరు టీమ్స్లో ఎవరు గెలిస్తే వారు.. నిఖిల్లో నుండి ఒక సభ్యుడిని తమ టీమ్లోకి తీసుకోవచ్చు అని వివరించారు. అలా యష్మీ, నైనికా టీమ్స్ మధ్య పోటీ మొదలయ్యింది. ముందుగా యష్మీ టీమ్ మొదటి టాస్క్లోనే గెలిచి నైనికా టీమ్పై ఒత్తిడి క్రియేట్ చేసింది. ఫైనల్గా మూడో టాస్క్ కూడా గెలిచి విన్నర్స్గా నిలిచింది. అక్కడే అసలు కథ మొదలయ్యింది.
అన్ని సౌకర్యాలు వారికే
యష్మీ టీమ్ విన్ అవ్వడంతో నిఖిల్ టీమ్లో ఉన్న సోనియాను తన టీమ్లోకి తీసుకుంది. దీంతో నిఖిల్ టీమ్లో ఇప్పుడు బేబక్క, నాగ మణికంఠ మాత్రమే మిగిలారు. టీమ్స్ ఫిక్స్ అయిన తర్వాత ఒక్కొక్క టీమ్కు ఒక్కొక్క పేరు పెట్టుకొని, ఒక జెండా కూడా తయారు చేసుకోమని బిగ్ బాస్ అన్నారు. దీంతో నైనికా.. అంతులేని వీరులు అని తన టీమ్కు పేరు పెట్టింది. యష్మీ టీమ్.. అఖండ అని, నిఖిల్ టీమ్.. కెరటం అని పేర్లు పెట్టి దానికి తగిన జెండాలు సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం యష్మీ టీమ్లో చీఫ్తో కలిపి ఆరుగురు సభ్యులు ఉన్నారు. పైగా నైనికా టీమ్ను ఓడించి గెలిచారు కాబట్టి వారికి ప్రత్యేకమైన సౌకర్యాలు అందించారు బిగ్ బాస్.
Also Read: సంచాలకుడిగా ఫెయిల్, పులిహోర రాజాగా పాస్.. బిగ్ బాస్ హౌజ్లో కొత్త ప్రేమకథ!
యాటిట్యూడ్ మారిపోయింది
బిగ్ బాస్ హౌజ్లో మూడు వేర్వేరు బెడ్ రూమ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఆ బెడ్ రూమ్స్ ఎవరికి అనే విషయాన్ని బిగ్ బాస్ చెప్పలేదు. ఇతర టీమ్స్పై గెలిచి అత్యధిక సభ్యులు ఉన్న టీమ్గా నిలిచింది కాబట్టి యష్మీ టీమ్కి డ్రాగన్ రూమ్ అంటే మాస్టర్ బెడ్ రూమ్ ఇచ్చారు. మిగిలిన కంటెస్టెంట్స్ను ఇతర రెండు బెడ్ రూమ్స్లో నచ్చింది ఎంచుకోమన్నారు. దీంతో యష్మీ టీమ్ అంతా చాలా సంతోషంగా ఆ బెడ్ రూమ్లో అడుగుపెట్టడంతో పాటు అక్కడ ఉన్న చాక్లెట్లు, జ్యూస్లను తింటూ, తాగుతూ ఎంజాయ్ చేశారు. అది చూసిన ఇతర హౌజ్మేట్స్కు నచ్చలేదు. గెలిచిన వెంటనే యష్మీ యాటిట్యూడ్ చాలా మారిపోయిందని అనుకోవడం మొదలుపెట్టారు.
నైనికా టీమ్ ఏడుపు
ఇక గెలిచింది కాబట్టి ఇతర హౌజ్మేట్స్ అంతా ఏం పనులు చేయాలి అనేది యష్మీను డిసైడ్ చేయమని బిగ్ బాస్ తెలిపారు. అప్పుడే నిఖిల్ టీమ్కు కేవలం కుకింగ్ ఇచ్చి మిగిలిన పనులన్నీ నైనికా టీమ్కు ఇచ్చింది. ఈ విషయాన్ని నైనికాతో పాటు తన టీమ్ కూడా జీర్ణించుకోలేకపోయింది. హౌజ్మేట్స్ అందరూ కలిసి చేయాల్సిన పనిని అయిదుగురు మాత్రమే ఎలా చేస్తారని విష్ణుప్రియా ఫీల్ అయ్యింది, ఏడ్చేసింది కూడా. అంతే కాకుండా సౌకర్యాలు వచ్చాయనే పొగరుతో యష్మీ టీమ్ మరింత రెచ్చిపోయింది. గిన్నెలు కడగాల్సిందే అంటూ సీతపై అభయ్ సీరియస్ అయ్యాడు. దీంతో తాను ఇంటి పనిమనిషిని కాదు అంటూ తాను కూడా ఏడవడం మొదలుపెట్టింది సీత. మొత్తానికి అధికారం వచ్చిందనే పొగరుతో యష్మీతో పాటు తన టీమ్మేట్స్ కూడా ఇతర హౌజ్మేట్స్ను తక్కువ చేసి చూడడం మొదలుపెట్టారని ప్రేక్షకులు భావిస్తున్నారు.