Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో ప్రస్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారితో పోటీపడడానికి మరో 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా జాయిన్ అవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కొత్తవారు కాదని, మునుపటి సీజన్స్లో వచ్చినవారే అని ప్రచారం గట్టిగా సాగింది. వీకెండ్ ఎపిసోడ్ ప్రారంభమయిన తర్వాత అదే విషయం కన్ఫర్మ్ అయ్యింది. ముందుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీల కేటగిరిలో హరితేజ, టేస్టీ తేజ వచ్చారు. ‘రాయల్ క్లాన్స్’ అనే పేరుతో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలను బిగ్ బాస్ హౌస్లోకి పంపారు నాగార్జున. ఈ ఇద్దరూ అలా రాగానే.. ఇలా ప్రైజ్ మనీ టాస్క్లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఇప్పటికీ ఫ్యాన్స్
బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్గా కనిపించింది హరితేజ. ఆ సీజన్లోని ఎంటర్టైన్మెంట్, కంటెస్టెంట్స్, టాస్కులు అంటే ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులకు ఇష్టం. ముఖ్యంగా హరితేజ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్, తను చెప్పిన హరికథ ఇప్పటికీ ఆడియన్స్కు గుర్తుండిపోయింది. తనే విన్నర్ అయితే బాగుండేది అనుకున్నవారు కూడా ఉన్నారు. ఫైనల్గా ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్గా ఎంటర్ అయ్యింది హరితేజ. తనకు ఆల్ ది బెస్ట్ చెప్తూ నవదీప్ ఒక వీడియో మెసేజ్ను పంపించాడు. హరితేజ కూతురు కూడా తనను బాయ్ చెప్పడానికి స్టేజ్పైకి వచ్చింది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన కంటెస్టెంట్స్ను.. హౌస్లో కత్తి ఎవరు, సుత్తి ఎవరు అని ప్రశ్నిస్తున్నారు నాగ్.
Also Read: నాలో ఈ యాంగిల్ ఉందని నాకే తెలియదు, తనొక ఫేక్ ఫ్రెండ్.. నైనికా కామెంట్స్
వారంతా సుత్తి
ముందుగా వచ్చిన హరితేజ.. కత్తి నబీల్ అని, సుత్తి అంటే చాలామంది ఉన్నారంటూ నవ్వింది. అలా కాకుండా ఒకరి పేరు చెప్పమంటే.. సీత బాగా ఏడుస్తుందని అందుకే తను సుత్తి అనిపిస్తుందని స్టేట్మెంట్ ఇచ్చింది. అంతే కాకుండా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో తనకు గట్టి పోటీ ఇచ్చేది యష్మీ అనిపిస్తుందని చెప్పింది. ఆ తర్వాత హరితేజ హౌస్లోకి వెళ్లి అందరితో సరదాగా మాట్లాడడం మొదలుపెట్టింది. అప్పుడే మరో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా తేజ ఎంటర్ అయ్యాడు. ఎప్పటిలాగానే చాలా ఎంటర్టైన్మెంట్తో ఫుల్ హడావిడితో కంటెస్టెంట్గా వచ్చాడు తేజ. తనను కూడా హౌస్లో కత్తి ఎవరు, సుత్తి ఎవరు అని అడగగా.. కత్తి కేటగిరిలో పృథ్వి, నిఖిల్ను పెట్టొచ్చు అన్నాడు. ఇక తేజకు శోభా శెట్టి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక వీడియో మెసేజ్ పంపింది.
నలుగురి మధ్య పోటీ
బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్గా వచ్చిన టేస్టీ తేజ.. అదే సీజన్లో మరొక కంటెస్టెంట్ అయిన శోభా శెట్టితో బాగా కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు అలా ఎవరితో అయినా కనెక్ట్ అవుతాననే ఆశతో తేజ హౌస్లోకి వెళ్లాడు. హౌస్లోకి వెళ్లేముందు తన చేతికి బిర్యానీ ఇచ్చి అది యష్మీకి ఇవ్వమన్నారు. దీంతో హౌస్లోకి వెళ్లగానే అందరితో సరదాగా కలిసిపోయిన టేస్టీ తేజ.. యష్మీతో పులిహోర కలపడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ‘స్వాగ్’ టీమ్ వచ్చి తేజ, హరితేజను ఒక టీమ్ చేసి.. విష్ణుప్రియా, నిఖిల్ను ఒక టీమ్ చేసి ఆట ఆడించారు. ఆ టాస్క్లో తేజ, హరితేజ గెలిచి బిగ్ బాస్ 8 ప్రైజ్ మనీలోకి రూ.20 లక్షలు యాడ్ చేశారు. రాయల్ క్లాన్స్ పేరును నిలబెట్టారు.