Bigg Boss 8 Day 27 Promo 3.. తాజాగా 27వ రోజు శనివారానికి సంబంధించిన మూడవ ప్రోమోని తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో ఆడియన్స్ అనుకున్నదే కంటెస్టెంట్స్ చెప్పి ఆ ముగ్గురిని టార్గెట్ చేశారు. ఇప్పటికే అర్థమయిపోయి ఉంటుంది.ఆ ముగ్గురు జిగిడి దోస్తులు ఎవరో.. వారేనండి సోనియా, నిఖిల్, పృథ్వీ.. తాజాగా ఈ ముగ్గురికి నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.
విష్ణు ప్రియ కి ఝలక్ ఇచ్చిన నాగార్జున..
కళామ్మతల్లి ముద్దుబిడ్డ అంటూ విష్ణు ప్రియ కు సంబంధించిన వీడియో వేశారు నాగార్జున. నిఖిల్ ఉద్దేశించి బొట్టు పెట్టి, గాజులు వేసి అంటూ హేళన చేసింది విష్ణు ప్రియ. దీనిపై ప్రశ్నించగా.. అలా ఎలా సిల్లీ గా ఇలాంటి మాటలు అనేస్తావ్ అంటూ ఫైర్ అయ్యారు నాగార్జున. ఇక తర్వాత యష్మీ హౌస్ లో ఎవరు హీరో.. వారికి క్రౌన్ పెట్టు అనగా.. ఆమె వెళ్లి నబీల్ కు క్రౌన్ పెట్టింది.ఎందుకు హీరో అనుకుంటున్నావు అని నాగార్జున అడగగా.. ఆయన లాగా ఆడాలి అనుకుంటున్నాను అని చెప్పింది. అనుకుంటున్నావా లేక ట్రై చేస్తున్నావా అని అడగగా.. ట్రై చేస్తున్నాను అని చెప్పింది యష్మీ. ఆ తర్వాత నాగార్జున ట్రై చేస్తున్నావా లేక వారిని చూస్తూ ఆట ఆడకుండా అలా ఉండిపోతున్నావా అంటూ ప్రశ్నించాడు.
నిఖిల్ , పృథ్వీ, సోనియా పై నాగ్ ఫైర్..!
అయితే నామినేషన్ లో జరిగిన వీడియోని ప్లే చేశారు నాగార్జున. ఎప్పుడు నిఖిల్, పృథ్వీలనే చూస్తే ఎలా యష్మి అంటూ సోనియా యష్మీ ను అడగగా.. దానికి యష్మీ..అవును వాళ్ళనే చూస్తాను.. నా ఇష్టం అంటూ రెచ్చిపోయింది. యష్మీ తో సోనియా నీ ఆట నాకు కనిపించడం లేదు అని చెప్పింది. తర్వాత పృథ్వీ మాట్లాడుతూ ..సోనియా చెప్పిన ప్రకారం ఆట చూస్తున్నారు. తన సెల్ఫ్ ఆటను నువ్వు చూడట్లేదు అన్నట్టుగా నిఖిల్, పృథ్వి సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. నాకైతే అలా చూసినట్టు అనిపించడం లేదు అంటూ నాగార్జున కూడా కామెంట్ చేశారు. వెంటనే ప్రేరణ కూడా వీరి వల్లే ఎవరు శక్తి క్లాన్ కి వెళ్లలేదు అంటూ కామెంట్ చేసింది. దీనివల్ల అంటే ఏంటి అంటూ మళ్ళీ ప్రశ్నించారు నాగార్జున. ఎంత నెగిటివ్గా అనిపించినా వారు మాత్రం వారి చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకొని, సేఫ్ జోన్ లో ఉంటారు అంటూ ప్రేరణ తెలిపింది. అసలు గేమ్ లో ఇండివిజువల్ గా వీరు కనిపించడం లేదు సార్ అంటూ సీతా కూడా చెప్పేసింది. ఇక వెంటనే సోనియా అన్ని మాటలు ఎందుకు అంటున్నావు సీత అని సోనియా ప్రశ్నించగా.. నేనెప్పుడూ నిఖిల్ తో గొడవపడినా మధ్యలో నువ్వు వస్తున్నావు.. అసలు ఎందుకు వస్తున్నావ్ అంటూ సీత ప్రశ్నించింది. ఇలాగే ఏం అర్థం చేసుకోకుండా మీ ఆటను మీరు పాడు చేసుకోండి.. సోనియా ఆటను కూడా పాడు చేయండి అంటూ నిఖిల్ పృథ్వీ పై ఫైర్ అయ్యారు నాగార్జున. మొత్తానికి అయితే ఈ ముగ్గురికి కౌంటర్ ఇచ్చారని చెప్పవచ్చు.