EPAPER

Telangana Politics: శ్రీమంతులే బీజేపీ టార్గెట్.. ప్రజా నేతలు కాంగ్రెస్ వైపు చూపు..

Telangana Politics: శ్రీమంతులే బీజేపీ టార్గెట్.. ప్రజా నేతలు కాంగ్రెస్ వైపు చూపు..

Telangana PoliticsTelangana Politics: బెదిరించడం.. లొంగదీసుకోవడం .. కాషాయ కండువాలు కప్పడం.. ఇది బీజేపీ వ్యూహం. ఆ పార్టీ ఏ రాష్ట్రంలోనైనా ఇదే ఫార్ములా అమలు చేస్తోంది. లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలోనూ ఈ తంత్రాన్ని ప్రయోగించింది.రాష్ట్రంలో బీజేపీ బలం అంతంత మాత్రమే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులు కూడా దొరికని పరిస్థితి ఎదురైంది. చాలామంది బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు డిపాజిట్లుకు కూడా తెచ్చుకోలేకపోయారు. ఉత్తర తెలంగాణలోనే కాస్త ఓటర్ల ఆదరణ కనిపించింది. హైదరాబాద్ లోనూ ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. ఎన్నికలకు ఏడాది ముందు అధికారమే లక్ష్యం అంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో చాలాసార్లు పర్యటించారు. కానీ పెద్ద ప్రభావం కనిపించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 7 సీట్లతోనే సరిపెట్టుకుంది.


లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీకి అభ్యర్థులు కరవయ్యారు. అందుకే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. అభ్యర్థుల వేటను ప్రారంభించింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడింది. ఆ పార్టీకి రెండు లోక్ సభ స్థానాలు కూడా దక్కే పరిస్థితి కనిపించడంలేదని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతలు వెనకడుగు వేస్తున్నారు. కారు దిగిపోతున్నారు. ఇదే బీజేపీకి అవకాశంగా మారింది. బడా వ్యాపారాలున్న నేతలను టార్గెట్ చేసింది. కాషాయ కండువాలు కప్పుకోవాలని ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలోనే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరిపోయారు. పెద్దపల్లి ఎంపీ పి.రాములు అదే బాట పట్టారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు బీజేపీ గాలం వేసింది.

జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బడా పారిశ్రామికవేత్త. ఆయనకు వేల కోట్ల వ్యాపారులున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో లేదు. ఆయన వ్యాపారాలు సజావుగా సాగాలంటే బీజేపీలో చేరడమే ఒక్కటే మార్గం. లేదంటే ఈడీ,ఐటీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఆయన కంపెనీలపై దాడులు చేసే అవకాశం ఉంటుంది. అందుకే బీబీ పాటిల్ కాషాయ కండువా కప్పేసుకున్నారు.


వరంగల్ ఎంపీ స్థానంపై బీజేపీ గురిపెట్టినా అక్కడ సరైన అభ్యర్థి లేరు. అందుకే అభ్యర్థి కోసం వేట ప్రారంభించింది. బీఆర్ఎస్ నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు పార్టీలోకి తీసుకొచ్చింది. ఆయన ఆర్థికంగా బలంగా ఉన్నారు. అందుకే ఆరూరి రమేష్ పై కాషాయ పార్టీ కన్నుపడింది. ఎన్నో ట్విస్టుల మధ్య ఆరూరి రమేష్ బీజేపీలో చేరిపోయారు. ఇక వరంగల్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. నాగర్ కర్నూల్ లో బీజేపీకి అభ్యర్థి లేడు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పి. రాములును పార్టీలోకి ఆహ్వానించింది.

మరోవైపు కాంగ్రెస్ గేట్లు ఎత్తేశామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ప్రజా సేవ చేయాలనుకునే నేతలు పార్టీలో రావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ లో ఇన్నాళ్లూ ఇమడలేకపోయిన నేతలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయకముందే.. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కారు దిగిపోయారు.ఆయన 2019 లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లోకి వెళ్లారు.మళ్లీ ఇప్పుడు హస్తం గూటికి చేరారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ , తెలంగాణ ఉద్యమకారుడు పసునూరి దయాకర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చేశారు. ఆయన 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో దాదాపు 25 ఏళ్లు కాంగ్రెస్ లోనే ఉన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా హస్తం గుర్తుపైనే గెలిచారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దానం గెలుపొందారు. ఖైరతాబాద్ లో మాస్ లీడర్ గా గుర్తింపు పొందిన దానంకు జనంలో మంచి ఆదరణ ఉంది. నిత్యం ప్రజల్లో ఉండే నేతగా గుర్తింపు ఉంది. ఆయన రాజకీయ జీవితాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. అందుకే తిరిగి తల్లి లాంటి పార్టీ చెంతకు చేరారు.అదే సమయంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Also Read: నార్త్‌లో సై అంటే సై అనే పొజిషన్‌లో ఉన్న బీజేపీ.. మోడీ వ్యూహం ఇదేనా!?

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత , సినీ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా, జీహీచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. వీరంతా ప్రజానేతలుగా గుర్తింపుపొందిన వారే. ఇలా ఉద్యమనాయకులు, ప్రజానాయకులను కాంగ్రెస్ అక్కున చేర్చుకుంటోంది. ప్రజాపాలన అందిస్తామని సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి .. సుధీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేసిన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నేతలకు కాంగ్రెస్ గేట్లు తెరిచి ఉంచుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే సూత్రాన్ని అమలు చేశారు. లోక్ సభ ఎన్నికల వేళ పార్టీ బలం మరింత పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags

Related News

Telangana: విమోచనం.. విలీనం.. విద్రోహం.. ప్రజా పాలనా దినం..! 2014 నుంచి 2024 దాకా..!

Telangana Armed Struggle: జనం నడిపిన విప్లవం.. సాయుధ పోరాటం..!

YS Jagan Mohan Reddy: జగన్ కాదు.. సీతయ్య.. వైసీపీలోనే గుసగుసలు

New Headache To YS Jagan: జగన్‌కు కొత్త తలనొప్పి.. కనక దుర్గ కండిషన్స్

New Election Commissioner: తెలంగాణ కొత్త ఎలక్షన్ కమీషనర్.. ఎవరంటే?

Big Shock to YS Jagan: వైసీపీ అడ్రస్ గల్లంతు.. 45 కార్పోరేటర్లు టీడీపీలోకి?

GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

Big Stories

×