EPAPER

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

Deadly Blasts Reported again in Lebanon a day after pagers Explode: యుద్ధ విమానాలు గాల్లోకి ఎగరలేదు.. బాంబుల వర్షం కురిపించలేదు.. సైనికులు యుద్ధ క్షేత్రంలోకి రాలేదు.. తుపాకుల నుంచి బుల్లెట్ల వర్షం కురిపించలేదు. కానీ యుద్ధం జరిగింది.. ఉగ్రవాదుల ప్రాణాలు పోయాయి. ఇది సరికొత్త యుద్ధం.. సాంకేతిక సమరం. ఇంతవరకూ, హ్యాకింగ్ చేయడం.. ప్రభుత్వ వ్యవస్థలను స్తంభింప చేయడం వంటి టెక్నిలక్ వార్‌లు చూసాం. అయితే, ఇప్పుడు అదే టెక్నాలజీతో ప్రత్యర్థుల చేతుల్లో ఉన్న వస్తువులను పేల్చే యుద్ధ తంత్రం వచ్చేసింది. ఇది శాంపిల్ మాత్రమే.. ఇంకా ఉంది. అంటే, ముందుముందు ఇలాంటి యుద్ధాలే మనం చూడబోతున్నామా..?


ఇది నిజం.. సెప్టెంబర్ 18న ఇజ్రాయెల్, యుద్ధంలో “కొత్త శకం” ప్రారంభమైందని చెప్పకనే చెప్పింది. నిన్నటి వరకూ యుద్ధ విమానాలు, వార్ షిప్‌లు, ఆర్మీ సోల్జర్లతో నడిచిన యుద్ధంలో ఇప్పుడు రూటు మార్చింది. మిడిల్ ఈస్ట్‌ను విస్తృత యుద్ధం అంచుకు నెట్టివేసిన హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ సరికొత్త యుద్ధాన్ని ప్రారంభించింది. ఇటీవల లెబనాన్‌లో చేసిన జంట దాడులతో తన కొత్త రూపాన్ని నిశ్శబ్దంగా అంగీకరించింది. ఇది ఎవ్వరూ ఊహించని విధ్వంసం. సెప్టెంబర్ 17న లెబనాన్‌లోని హిజ్బుల్లా తీవ్రవాదులు వాడుతున్న పేజర్లే బాంబులుగా మారాయి. టెక్స్ట్ మెసేజ్‌లు కోసం వాడే ఈ యంత్రం చేతిల్లోనో.. జేబుల్లోనో.. టేబుల్ పైనో.. ఎక్కడుంటే అక్కడే పేలిపోయి, ప్రాణాలు తీశాయి. ఒకటి కాదు రెండు కాదు, లెబనాన్ వ్యాప్తంగా వేల సంఖ్యలో పేజర్లు పేలిపోవడం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ పేలుళ్లలో చిన్నారులతో సహా 12 మంది మృతి చెందారు. దాదాపు 3 వేల మంది గాయపడ్డారు. ఇది ఎలా జరిగిందో అర్థం చేసుకొని, తేరుకునే లోపే, లెబనాన్ బీరుట్‌తో పాటు దక్షిణ లెబనాన్‌లో వాకీ-టాకీలు కూడా పేలడం ప్రారంభించాయి. సెప్టెంబర్ 18న జరిగి వాకీ-టాకీ పేలుళ్లలో 20 మంది మృతి చెందగా, దాదాపు 500 మంది గాయపడ్డారు.

సరిగ్గా 24 గంటల్లోనే రెండు పరికరాలు బాంబులుగా మారి ప్రాణాలు తీసాయి. ఇవి రోజూ మనం వాడుతున్న సెల్ ఫోన్ల వంటివే. పేజర్లు.. మెసేజ్‌ల కోసం మాత్రమే వాడితే, ఇన్‌స్టెంట్ వాయిస్ కమాండ్ల కోసం వాకీ-టాకీలు వాడతారు. అయితే, ఇలాంటి అనూహ్య దాడులకు ఇజ్రాయెలే కారణమని లెబనాన్‌లోని హిజ్బుల్లాతో పాటు, ఇరాన్ కూడా నిప్పులు చెరుగుతుంటే.. ఇజ్రాయెల్ మాత్రం, ఎప్పటి లాగే మౌనంగా ఉంది. దీనికి కారణం మేమని గానీ, మేము కాదు అని గానీ ఇజ్రాయెల్ ఇంత వరకూ చెప్పనే లేదు. సెప్టెంబర్ 17 నాటి పేజర్ పేలుళ్లపై వ్యాఖ్యానించడానికి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ నిరాకరించిన తర్వాత.. 24 గంటల్లో.. అంటే, సెప్టెంబర్ 18న ఉత్తర ఇజ్రాయెల్‌లోని రామత్-డేవిడ్ వైమానిక దళ స్థావరాన్ని సందర్శించారు గాలంట్. అప్పుడు గానీ ఈ దాడులకు సంబంధించి నోరు విప్పారు. అందులోనూ, చాలా స్ట్రాటజిక్‌గా మాట్లాడారు. “మేము ఈ యుద్ధంలో కొత్త శకం ప్రారంభంలో ఉన్నాం. కాలానికి తగ్గట్లు మనల్ని మనం తయారుచేసుకోవాలి” అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాలంట్ అన్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అద్భుతమైన విజయాలను ప్రశంసిస్తూ.. దేశ భద్రతా ఏజెన్సీ, షిన్ బెట్‌తో పాటు, దాని గూఢచార సంస్థ మొసాద్‌తో కలిసి ఇజ్రాయెల్ దిగ్విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఈ మాటలను బట్టి, లెబనాన్‌లో జరిగిన ఘటనలకు ఇజ్రాయెల్ కారణమని స్పష్టంగానే తెలుస్తుంది.


నిజానికి, ఇజ్రాయెల్ ఇంత త్వరగా ఇది తమ పని అని చెబుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఒక విధంగా రక్షణ మంత్రి గాలంట్ వ్యాఖ్యలు ఈ జంట దాడుల్లో ఇజ్రాయెల్ పాత్రను స్పష్టంగా అంగీరించినట్లే అనుకోవాలి. సెప్టెంబర్ 17 నాటి ఆపరేషన్ … ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, గూఢచార సంస్థ మొస్సాద్ కలిసి చేసిన ఉమ్మడి ప్రయత్నమనే నివేదికలు ఉన్న తరుణంలో… గాలంట్ వ్యాఖ్యలను కూడా కలుపుకుంటే, లెబనాన్ జంట దాడులు హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో భాగమనే అనుకోవాలి. ఒక విధంగా ఇది “యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్” అనే కీలక నిర్ణయం తీసుకోవాల్సిన తరుణంలోనే ఇజ్రాయెల్ దీనికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అంటే, లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూపు వాడుతున్న పేజర్లలో పేలుడు సామాగ్రిని తయారీ దశలోనే అమర్చిన ఇజ్రాయెల్ వాటిని వాడాల్సిన టైమ్ వచ్చింది కాబట్టి వాడేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న హమాస్, హిజ్బుల్లాతో యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్ సెప్టెంబర్ 16న ఓటు వేసింది. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత పేజర్ పేలుళ్లు సంభవించడం ఇజ్రాయెల్ ప్రిప్లాన్డ్‌గానే ఈ అటాక్‌ చేసిందని చెప్పకనే చెబుతోంది.

Also Read: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య దాదాపు ఒక సంవత్సరం పాటు నడిచిన సంఘర్షణల తర్వాత, దక్షిణ లెబనాన్, ఉత్తర ఇజ్రాయెల్‌లో పదివేల మంది ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి ఇజ్రాయెల్ నివాసితులు తిరిగి రావడం రాజకీయ అవసరంగా మారింది. అందుకే, ఇజ్రాయెల్ తన అధికారిక యుద్ధ లక్ష్యాన్ని మొదటిసారి ప్రకటించి, హిజ్బుల్లాపై యుద్ధానికి ఓటు వేసింది. సెప్టెంబర్ 18న, నెతన్యాహు తన ఇజ్రాయెల్‌ ఉత్తరాన నివశించే ప్రజలను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి తీసుకురండి అని కూడా ప్రకటించారు. తర్వాత, ఇజ్రాయెల్ డిఫన్స్ ఫోర్స్ తన 98వ శాఖను గాజా నుండి ఉత్తర ఇజ్రాయెల్‌కు తరలించే విషయం బయటపడింది. దీన్ని బట్టి, ఇజ్రాయెల్ ఉత్తర దిశలో యుద్ధం తీవ్రతరమవుతుందని అప్పుడే హింట్ ఇచ్చినట్లయ్యింది. ఇక, సెప్టెంబర్ 18న లెబనాన్‌లో దేశవ్యాప్తంగా వాకీ-టాకీలు పేలడంతో ఇజ్రాయెల్ ప్రీ ప్లాన్డ్ యుద్ధ తంత్రం అర్థమయ్యింది.

సెప్టెంబర్ 18న దాదాపు సాయంత్రం అవుతున్న తరుణంలో వాకీ టాకీలు పేలడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. హిజ్బుల్లా ఉగ్రవాదుల చేతుల్లోని వాకీ టాకీలు ఒకొక్కటిగా పేలుతూ.. కొందరి చేతులు ఆ బాంబు పేలుళ్లలో ఊడిపోతే, ఇంకొందిరవి ముఖాలు, ఛాతీ, కాళ్లు.. ఇలా వాకీ టాకీలు పెట్టుకున్న ప్రాంతంలో శరీరం చిధ్రమైపోయింది. వాకీ-టాకీలు పేలడంతో దాదాపు 60 ఇళ్లు, షాపుల్లో మంటలు చలరేగాయి. అయితే, అప్పుడే అర్థమయ్యింది. 24 గంటల ముందు పేజర్లలో ఎలా పేలుడు పదార్థాన్ని అమర్చారో అలాగే వాకీ టాకీల్లోనూ వాటి తయారీ సమయంలోనే పేలుడు పదార్థం ఉంచి తయారు చేశారు. ఆయా కంపెనీల నుండి ఈ పరికరాలను గంపగుత్తుగా కొనుగోలు చేసిన హిజ్బుల్లా సంస్థలు వీటిని గుర్తించలేకపోవడం వల్ల.. ఎలాంటి ప్రత్యక్ష దాడులు లేకుండానే ఇజ్రాయెల్ శత్రువులకు చెమటలు పట్టించింది.

అయితే, ఈ వాకీ-టాకీలను తయారు చేసే జపనీస్ సంస్థ ICOM వీటి తయారీని ఎప్పుడో నిలిపేసినట్లు ప్రకటించింది. పేలుడుకు గురైన IC-V82 పరికరాలు, గుర్తింపు పొందిన ఏజెంట్ ద్వారా సరఫరా కాలేదని తర్వాత తెలిసింది. సదరు ఏజెంట్ అధికారికంగా లైసెన్స్ పొందలేదు. అలాగే, సెక్యూరిటీ సర్వీస్ ద్వారా తనిఖీ కూడా చేయబడలేదని తెలిసింది. ICOM సంస్థ ఈ పేలుళ్లకు సంబంధించిన మోడల్‌ను పది సంవత్సరాల క్రితమే నిలిపివేసినట్లు వెల్లడించింది. దీన్ని బట్టి, హిజ్బుల్లా వాడుతున్న IC-V82 పరికరాలన్నీ నకిలీవని తేలింది. అయితే, అవి నకిలీవా లేదంటే కంపెనీ ద్వారా అప్పట్లోనే రవాణా చేయబడినవా అనేది గుర్తించలేకపోయామని ICOM సంస్థ పేర్కొంది. పేజర్ల విషయంలోనే అంతే జరిగింది. తైవన్‌కు చెందిన గోల్డ్ అపోలో తన బ్రాండ్ పేరుతో వచ్చిన పెజర్లను తాము తయారుచేయలేదనీ.. బుడాపెస్ట్-నమోదిత పంపిణీదారుకు చెందిన కంపెనీకి తమ బ్రాండ్‌తో పేజర్లు తయారు చేయడానికి అనుమతి ఇచ్చామనీ, బహుశా పేలుడుకు గురైన పేజర్లు అక్కడి నుండే వచ్చి ఉండొచ్చని ప్రకటించింది. అయితే, హంగేరియన్ అధికారులు గోల్డ్ అపోలో వ్యాఖ్యలను ఖండించారు. BAC కన్సల్టింగ్ సంస్థకు తయారీ సైట్‌లు లేవని, అది కేవలం “బిజినెస్ బ్రోకర్‌”గానే ఉందని అన్నారు.

ఏది ఏమైనప్పటికీ, పేలుడుకు కారణమైన ఈ పరికరాలు ఎక్కడ నుండి వచ్చాయన్నది సస్పెన్స్‌గానే ఉంది. అయితే, తక్కువ-టెక్నాలజీతో తయారు చేసిన వైర్‌లెస్ కమ్యూనికేషన్ పరికరాలు శత్రు సైన్యాల నిఘాకు అందవనే కారణంతోనే హిజ్బుల్లా వాటిని వాడినప్పటికీ అవి వాళ్లకు యమపాశాలయ్యాయి. ఈ పరిణామం, తైవాన్ నుండి హంగేరీ వరకు విస్తరించి ఉన్న సీక్రేట్ సరఫరా గొలుసుపై అనుమానాలను రేకెత్తించాయి. తైవాన్ తయారీదారు గోల్డ్ అపోలో నుండి ఆర్డర్ చేసిన పేజర్ల బ్యాచ్‌లో ఇజ్రాయెల్ పేలుడు పదార్థాలను దాచిపెట్టడం, హిజ్బుల్లా లక్ష్యంగానే చేసిన పని అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే, సరైన సమయానికి వాటిని పేల్చడానికి ఒక కామన్ స్విచ్‌ను ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే, ఇది ఎప్పుడు జరిగింది, ఎలా వీటిని మార్చారూ అనే విషయాన్ని ఇజ్రాయెల్ చెప్పినప్పుడు అందులో నిజానిజాలు తెలుస్తాయి. ఈ లోపు, ఇజ్రాయెల్ చేసిన, పేజర్ దాడులకు తీవ్రమైన మూల్యం చెల్లించుకుంటుందని హిజ్బుల్లా ప్రతిజ్ఞ చేసింది. అయితే, ఇప్పటికే, లెబనాన్‌లో హిజ్బుల్లాపై యుద్ధానికి సిద్ధమైన ఇజ్రాయెల్ ఇంకెన్ని రహస్య ఆయుధాలను రెడీగా ఉంచుకుందో తెలియదు.

ఈ మధ్యలో.. లెబనాన్‌లో జరిగిన హననంపై యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ చీఫ్, వోల్కర్ టర్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేజర్ దాడులు అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించాయని అన్నారు. బూబీ ట్రాప్‌లను ఉపయోగించడాన్ని అంతర్జాతీయ సమాజం నిషేధించిన విషయాన్ని గుర్తుచేశారు. పౌరులు ఆకర్షితులయ్యే వస్తువుల్లో.. లేదంటే, సాధారణ పౌర జీవితంలో రోజువారీ ఉపయోగించే వస్తువుల్లో మోసపూరితంగా ఇలాంటి పేలుడు పదార్థాలు ఉంచడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని తేల్చారు. దీనిపై, స్వతంత్రంగా లోతైన, పారదర్శక విచారణ జరిపించాల్సిందిగా కోరారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ కూడా ఈ పరిణామాన్ని వ్యతిరేకించారు. ఇరు దేశాలూ ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం కాకుండా నిరోధించాలని కోరారు. ‘ఇలా టెక్ పరికరాలను పేలిపోయేలా చేయడంలోని లాజిక్, ఒక పెద్ద సైనిక చర్యకు ముందస్తు సూచన’ అని యూఎన్ చీఫ్ వెల్లడించారు.

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×