EPAPER
Kirrak Couples Episode 1

Delhi: లిక్కర్ స్కాంలో కొండను తవ్వి ఎలుకలను పట్టిన సీబీఐ?

Delhi: లిక్కర్ స్కాంలో కొండను తవ్వి ఎలుకలను పట్టిన సీబీఐ?

Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా ప్రకంపణలు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ లిక్కర్ స్కాం లింకులు బయటపడ్డాయి. మొదట్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియానే టార్గెట్ గా ఈ కేసు తెరమీదకు వచ్చింది. ఆయన ఇల్లు, ఆఫీసుల్లోనూ సోదాలు జరిగాయి. అంతా ఆయనే చేశారంటూ బీజేపీ తెగ ప్రచారం చేసింది. సిసోడియా జైలుకు వెళ్లడం ఖాయమని.. ఇక ఆప్ పని ఖతమని ఊదరగొట్టింది. ఇన్నాళ్లూ ఇంత హంగామా చేస్తే.. చివరాఖరికి ఛార్జ్ షీట్ దాఖలు చేసే సమయానికి.. అసలు మనీష్ సిసోడియా పేరే లేకపోవడం ఆసక్తికరం.


ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ ఏకంగా 10వేల పేజీల తొలి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఛార్జ్‌షీట్‌లో ఏ1గా అప్పటి అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్‌ కుల్దీప్‌సింగ్‌, ఏ2గా అబ్కారీశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నరేందర్‌సింగ్‌, ఏ3గా విజయ్‌ నాయర్‌, ఏ4గా అభిషేక్‌ బోయిన్‌పల్లి పేర్లను పొందుపరిచింది. వీరితో పాటు సమీర్‌ మహేంద్రు, రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్‌ పేర్లను చేర్చింది సీబీఐ. అంటే, ఆప్ మంత్రుల ప్రమేయం లేకుండానే.. అధికారులు, వ్యాపారులు మాత్రమే లిక్కర్ స్కాంకు పాల్పడ్డారనేది సీబీఐ అభిప్రాయం కాబోలు. ఇక, శరత్ చంద్రారెడ్డి పేరు కూడా మొదటి ఛార్జిషీటులో లేకపోవడం ఆశ్చర్యకరం.

అయితే, కేసు దర్యాప్తు ఆధారంగా మరికొన్ని ఛార్జ్‌షీట్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈడీ కూడా ఛార్జ్‌షీట్లు వేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ ఆమోదంపై ఈనెల 30న రౌస్‌ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకోనుంది.


అదేంటి? మనీష్ సిసోడియా పేరు లేకపోవడం ఏంటి? ఇదే ఇప్పుడు చర్చనీయాంశం. బీజేపీ మైండ్ గేమ్ పాలిటిక్స్ ఇలానే ఉంటాయంటోంది ఆప్. కావాలనే.. తమ పార్టీని బద్నామ్ చేయాలనే.. సిసోడియా పేరు ప్రముఖంగా వినిపించేలా చేసిందని ఆరోపిస్తోంది. సిసోడియాకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా.. కేంద్రం ఒత్తిడితోనే మనీష్ సిసోడియా ఇల్లు, కార్యాలయంలో సీబీఐ రైడ్స్ జరిగాయని.. ఆయనకు సమన్లు కూడా ఇచ్చారని మండిపడుతున్నారు. ఆప్ కు అవినీతి మరక అంటించాలని చూశారని.. అయితే అది సాధ్యం కాలేదని తప్పుబడుతోంది.

ఇక, తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. అభిషేక్ బోయిన్ పల్లి పేరును ఏ4గా చేర్చింది సీబీఐ. విచారణ అభిషేక్ వరకే ఆగిపోతుందా? లేక, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టు కేసీఆర్ కూతురు కవిత వరకూ వస్తుందా? అనేది రాజకీయంగా కీలకాంశంగా మారనుంది. అటు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి అన్న అయిన శరత్ చంద్రారెడ్డి పేరు ఛార్జిషీట్ లో లేకపోవడమూ పొలిటికల్ అంశమే.

Related News

Nandagiri Hills: నెట్ నెట్ వెంచర్స్.. అడ్డగోలు నిర్మాణాలకు కేరాఫ్..!

Kimidi Family Cold War: కిమిడి ఫ్యామిలీ వార్.. 40 ఇయర్స్ ఇండస్ట్రీలో కత్తులు దూసుకునే రాజకీయం

DY CM Pawan Kalyan: పవన్ ప్రాయశ్చిత దీక్షవెనుక ఇంత కథ ఉందా ?

Telangana BJP: అభయ్ ఆగయా.. టీ బీజేపీకి వెన్నులో వణుకు?

KA Paul And JD Lakshmi Narayana: సరిపోయారు ఇద్దరూ.. విశాఖ నుండి ఔట్?

Khajaguda Land Kabja: ఖాజాగూడలో కబ్జా బాగోతం.. రూ.3000 కోట్ల భూమి ఖతం.. ఆ మాజీ మంత్రే సూత్రధారా?

మేఘా అవినీతి ముసుగులో అధికారులు..!

Big Stories

×