YSRCP Third List: వైసీపీ మూడో జాబితాలో భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది. దాదాపుగా 13 మందికి జగన్ మొండిచేయి చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో వాళ్లు అలకబూనకుండా.. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తామని భరోసానిస్తున్నారు. జాబితా మరింత ఆలస్యం అవుతుండటంతో వైసీపీ నేతలు టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు.
అయితే మూడో జాబితా ఇదిగో.. అదిగో అంటూ వైసీపీ పది రోజుల నుంచి కాలం వెల్లదీస్తోంది. క్యాంపు ఆఫీసుకు ఎమ్మెల్యేలను పిలిచినా వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, వైజాగ్ జిల్లాల మార్పులు చేర్పులతో థర్డ్ లిస్ట్ విడుదల అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
మరోవైపు వైసీపీలో అసంతృప్తుల బెడద తీవ్రంగా ఉంది. సీఎం దర్శనం కోసం వేచి చూసి మాజీ మంత్రి బాలినేని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే వెళ్లే ముందు ఐ ప్యాక్ టీమ్కు తాను అనుకున్నది చెప్పి అక్కడి నుంచి బయల్దేరారు. ఇది ఇలా ఉండగా.. ఇప్పటికే అలకపాన్పుపై ఉన్న మల్లాది విష్ణు, పార్థసారధి వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ లోగా కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేశాడు.