Magunta Sreenivasulu Reddy Joined In TDP: ఒకవైపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మరోవైపు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఇంకోవైపు వలసల పర్వం కొనసాగుతోంది. ఒంగోలు సిట్టింగ్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరారు. ఆయన కుమారుడు రాఘవరెడ్డి కూడా పసుపు కండువా కప్పుకున్నారు.
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి మాగుంట శ్రీనివాసులరెడ్డి, తన కుమారుడు రాఘవరెడ్డితో కలిసి వచ్చారు. ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి తండ్రీకొడుకులను ఆహ్వానించారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లాలో టీడీపీకి బలం పెరుగుతుందనే అంచనాలున్నాయి.
Also Read : వైసీపీ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన సీఎం జగన్.. ఫుల్ లిస్ట్ ఇదే..
మాగుంట ఫ్యామిలీతోపాటు మరికొందరు కీలక నేతలు సైకిల్ ఎక్కారు. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరారు. అలాగే అద్దంకి చెందిన వైసీపీ నేతలు బాచిన కృష్ణ చైతన్య, గరటయ్య పసుపు కండువాలు కప్పుకున్నారు. వీరంతా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలోకి వచ్చారు.