YSRCP Meeting : సీఎం జగన్ మార్పులు చేర్పులతో విశాఖ జిల్లా గాజువాక వైసీపీ శిబిరంలో అలజడి నెలకొంది. నియోజకవర్గ మార్పులతో వైసీపీ కార్యకర్తల ముఖ్య సమావేశం రసాభాసాగా సాగింది. వైవీ సుబ్బారెడ్డిని ఘోరావ్ చేశారు. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి , పవన్ కళ్యాణ్ ను ఓడించిన తిప్పల నాగిరెడ్డికి టికెట్ ఇవ్వపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసింది కార్యకర్తలయితే.. వాస్తవాలు తెలియకుండా నాయకుల్ని ఎలా ఎంచుకుంటారని మండిపడ్డారు. నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తేనే అందరం కలిసికట్టుగా ఉండి వైసీపీని గెలిపిస్తామని తేల్చి చెప్పారు.
ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు వైవీ సుబ్బారెడ్డి. సీఎం జగన్ ఆదేశాలతో, సర్వేలు, సామాజిక వర్గాల సమీకరణలతోనే బీసీకి సీటు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నాగిరెడ్డికి సీటు ఇవ్వకపోయినా శాసనమండలిలో తప్పనిసరిగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ నాగిరెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు కార్యకర్తలు. విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి.