EPAPER

AP News: దుప్పిని చంపి.. వండుకు తిన్న వైసీపీ నేతలు!.. ఏపీలో కలకలం..

AP News: దుప్పిని చంపి.. వండుకు తిన్న వైసీపీ నేతలు!.. ఏపీలో కలకలం..

AP News: అధికార వైసీపీ నేతలు చుక్కల దుప్పిని చంపి విందు చేసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దారి తప్పి జనారణ్యంలోకి వచ్చిన ఓ దుప్పి నేతలకు ఆహారమైంది.


అరుదైన చుక్కల దుప్పిని చంపి ఆరగించిన సంఘటన యర్రవారిపాలెం మండలం వీఆర్ అగ్రహారంలో చోటుచేసుకుంది. శేషాచల అటవీ ప్రాంతం నుంచి దుప్పి గ్రామంలోకి వచ్చి చేరింది. పంటపొలాల్లో సంచరిస్తుండగా గమనించిన వైసీపీ కార్యకర్తలు.. కుక్కతో దాడి చేయించి చంపేశారు. ఆ తర్వాత దుప్పి మాంసంతో విందు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దుప్పిని పట్టుకుంటున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వ్యవహారం బయటకొచ్చింది. ఆ వీడియో ఆధారంగా నిందితులను తేల్చే పనిలో పడ్డారు ఫారెస్ట్ అధికారులు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. నిందితులు వైసీపీకి చెందిన మాజీ సర్పంచి చంద్ర, కృష్ణయ్య, నాగేశ్వరరావు, చిన్నబ్బ లతో పాటు పలువురు మహిళలు కూడా ఉన్నట్టు గుర్తించారు.


Related News

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Big Stories

×