YSRCP : శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫేస్బుక్ లైవ్లో ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేను వివరణ కోరారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పద్మావతికి పిలుపొచ్చింది. వెంటనే తాడేపల్లి రావాలని సీఎంవో అధికారులు సూచించారు. దీంతో ఆమె అమరావతికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి సీఎం జగన్ను కలవనున్నారు.
YSRCP : శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫేస్బుక్ లైవ్లో ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేను వివరణ కోరారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పద్మావతికి పిలుపొచ్చింది. వెంటనే తాడేపల్లి రావాలని సీఎంవో అధికారులు సూచించారు. దీంతో ఆమె అమరావతికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి సీఎం జగన్ను కలవనున్నారు.
మరోవైపు మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, వెలంపల్లి శ్రీనివాస్కు సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సాయంత్రంలోగా వారు సీఎంను కలవనున్నారు. తమ సీట్ల విషయంపై జగన్తో చర్చించనున్నారు.