YCP Attack on TDP Polling Agents in Macherla: ఆంధప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం ఏడు గంటలకే ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు ఓటర్లు.
పోలింగ్ మొదలుకాగానే వైసీపీ నేతల దాడులు మొదలయ్యాయి. పల్నాడులోని మాచర్ల నియోజకవర్గ పరిధిలోని రెంటచింతలలో టీడీపీ ఏజెంట్లపై దాడి చేశారు వైసీపీ నేతలు. ఈ ఘటనలో టీడీపీ ఏజెంట్లకు తీవ్రగాయాలయ్యాయి. వీరి స్థానంలో మరో ఇద్దరు ఏజెంట్లను అధికారులు అనుమతించారు.
మాక్ పోలింగ్ తర్వాత రెగ్యులర్ పోలింగ్ మొదలైన క్రమంలో వైసీపీకి చెందిన ఏజెంట్లు.. టీడీపీ వాళ్లపై దాడులు చేశారు. ఈ ఘటలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రి తరలించారు.
Also Read: చంద్రబాబు ఇంటర్వ్యూ, ఈసీకి టీడీపీ ఫిర్యాదు, ఫేక్ వీడియో వెనుక,
ఈ విషయం తెలియగానే ఎన్నికల అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్కు ముందే పల్నాడులో గొడవలు జరగడంపై మండిపడ్డారు. అవసరమైతే అదనపు బలగాలను రంగంలోకి దించాలని జిల్లా అధికారులకు సూచన చేశారు. దీంతో పోలింగ్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మొహరించారు.
మరోవైపు పల్నాడు జిల్లా అచ్చంపేట పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య వివాదం నెలకొంది. వైసీపీ నేతలు బూత్ లలో ప్రచారం చేయడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు సైలెంట్ గా ఉండడంతో వారితో వాగ్వాదానికి దిగారు టీడీపీ కార్యకర్తలు.
Also Read: Ysrcp Vs Tdp prediction in AP: వందేసి గెలుస్తామంటున్న వైసీపీ, టీడీపీలు, పోలింగ్ శాతంపై దృష్టి
పల్నాడు జిల్లా అచ్చంపేట పోలింగ్ కేంద్రం వద్ద వివాదం. వైసీపీ నేతలు బూత్ లలో ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం. పోలీసులతో వాగ్వాదానికి దిగిన టీడీపీ కార్యకర్తలు.#APElections2024 #AndhraPradesh #Palnadu #YSRCP #TDP #NewsUpdates #bigtvlive pic.twitter.com/jBKM8maEIs
— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2024
మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ దౌర్జన్యం. రెంటచింతలలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ శ్రేణుల దాడి. నలుగురు టీడీపీ ఏజెంట్లకు తీవ్రగాయాలు. ఏజెంట్లుగా టీడీపీ వ్యక్తులు ఉండొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న వైసీపీ.#YSRCPRowdyism #YcpCriminalPolitics #EndOfYCP #AndhraPradeshElections2024 pic.twitter.com/ElCzYpRMDO
— Telugu Desam Party (@JaiTDP) May 13, 2024