EPAPER

YS Sharmila meets Jagan | కాంగ్రెస్‌లో చేరేముందు అన్న జగన్‌తో షర్మిల భేటీ.. కారణమిదే..

YS Sharmila meets Jagan | ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అన్న చెల్లెళ్ల మధ్య వార్ మొదలవుబోతోంది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక దాదాపు ఖాయం కావడంతో ఏపీ పాలిటిక్స్ వేడి పీక్స్‌లో ఉంది. ఈ నేపథ్యంలో షర్మిల తన అన్న, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. దీనికి కారణం ఏముంటుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో శత్రువులుగా మారిన వీరిద్దరూ.. ఎన్నికల ముందు ఒకసారి కలుసుకోనున్నారు.

YS Sharmila meets Jagan | కాంగ్రెస్‌లో చేరేముందు అన్న జగన్‌తో షర్మిల భేటీ.. కారణమిదే..

YS Sharmila meets Jagan | ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అన్న చెల్లెళ్ల మధ్య వార్ మొదలవుబోతోంది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక దాదాపు ఖాయం కావడంతో ఏపీ పాలిటిక్స్ వేడి పీక్స్‌లో ఉంది. ఈ నేపథ్యంలో షర్మిల తన అన్న, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. దీనికి కారణం ఏముంటుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో శత్రువులుగా మారిన వీరిద్దరూ.. ఎన్నికల ముందు ఒకసారి కలుసుకోనున్నారు.


ఈ విషయంలో షర్మిల స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. షర్మిల బుధవారం ఢిల్లీ వెళ్లి.. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్నారు. వైఎస్ షర్మిల పులివెందుల సమీపంలోని ఇడుపులపాయ వద్ద జననేత వైఎస్సార్‌ సమాధి వద్ద మంగళవారం నివాళులర్పించారు. ఆమె వెంట కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితోపాటు ఆమె తల్లి వైఎస్‌ విజయమ్మ కూడా ఉన్నారు.

‘‘గతంలోనే కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. అందుకోసమే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిచ్చాం. మా మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలవడానికి వైఎస్ఆర్‌టిపీ 31 స్థానాల్లో పోటీ పెట్టకపోవడమే కారణం. కాంగ్రెస్‌ అధిష్ఠానం మా త్యాగాన్ని గుర్తించి ఆహ్వానించింది. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకే బుధవారం దిల్లీ వెళ్తున్నాను. మరో రెండు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తాయి. నా కుమారుడు రాజారెడ్డి వివాహం సందర్భంగా వైఎస్సార్‌ ఆశీస్సులు కోసమే ఇడుపులపాయ వచ్చాను’’ అని వైఎస్ షర్మిల వివరించారు.


ఇదిలా ఉంటే బుధవారం తాడేపల్లిలో ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతం కానుంది. దాదాపు రెండేళ్ల తర్వాత ఏపీ సీఎం జగన్ ను సోదరి షర్మిల కలుసుకోనున్నారు. తల్లి విజయమ్మతోపాటు ఆమె జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లనున్నారు. ఇడుపులపాయ నుంచి నేరుగా తాడేపల్లికి వెళ్లనున్నారు షర్మిల. తన తనయుడు ఎంగేజ్ మెంట్ వేడుకకు జగన్ ను ఆహ్వానించనున్నారు. జగన్ ను కలిసిన తర్వాత ఆమె నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరబోతున్న నేపథ్యంలో ఇద్దరి ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ లో చేరిక అంశం కూడా ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది.

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×