YS Sharmila: ఏపీ కూటమి ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతే కాకుండా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతు పక్షపాతిగా హామీలు ఇచ్చి ప్రస్తుతం వారిని పట్టించుకోవడం లేదంటూ ట్విటర్ వేదికగా ఆమె ఆరోపించారు.
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి రైతుల బాధలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అంతే కాకుండా పల్నాడు జిల్లాలో రైతులు రాత్రి సమయం వరకు విత్తనాల కోసం నిలబడ్డారని తెలిపారు.సాగర్ కుడికాలువ క్రింద పంట సాగు చేసే రైతులకు విత్తన కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. కుండపోత వర్షాలోనూ మహిళలు విత్తనాల కోసం ఇబ్బందులు పడ్డారని అన్నారు. గత ప్రభుత్వం రైతుల కోసం పని చేయకపోవడం వల్లే రైతులు కూటమికి పట్టం కట్టారని తెలిపారు.
విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన వివరణ తలా తోక లేనిది. సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా ? పల్నాడు జిల్లాలో కౌంటర్ల దగ్గర రైతుల పడుతున్న కష్టాలు మీకు కనిపించడం లేదా ? సంబంధిత శాఖ మంత్రిగా నేరుగా… https://t.co/WnNbwI1LAA pic.twitter.com/6fjYn29GAv
— YS Sharmila (@realyssharmila) August 9, 2024
జగన్ రైతులను నిండా ముంచాడనే కదా.. 11 సీట్లకు పరిమితం చేశారు. కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని తెలిపారు. రైతులను వ్యతిరేకించే బీజేపీతో జతకూడటంతో పాటు రైత పక్షపాతిగా ఉంటామని చెబుతూ అసత్యపు హామీలను కూటమి ఇచ్చిందని అన్నారు. ఇప్పటికైనా రైతులకు అవసరం అయిన 384 రకం విత్తనాలను వెంటనే పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.