YS Jagan: సీఎం చంద్రబాబు రాష్ట్రంలో బయానక వాతావరణం సృష్టిస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో చెడు సాంప్రదాయానికి సీఎం నాంది పలికారని తెలిపారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే టీడీపీ చేస్తున్న దాడులను వెంటనే ఆపేయాలని సూచించారు.
దాడులు ఆపకపోతే అవే వాళ్లకు తిప్పికొడతాయని గుర్తించాలన్నారు. వైసీపీకి ఓటు వేసినందుకు 20 ఏళ్ల యువకుడిన దారుణంగా కొట్టారని అన్నారు. వైసీపీ నేత అజయ్పై దాడి చేయడం దారుణం అని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు. అధికారం శాశ్వతం కాదని చెప్పారు. శిశుపాలుడి పాపాల మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయని అన్నారు. అధికారం మారిన రోజు ఆ పాపాలే తనకు చుట్టుకుంటాయని గుర్తించాలన్నారు.
ఈ సంస్కృతి ఆపేయాలని చంద్రబాబును మరో సారి హెచ్చరిస్తున్నా.. ఇది సరైన పద్దతి కాదు అని చెప్పారు. వైసీపీపై దాడులు ఆపకపోతే న్యాయపోరాటం చేస్తామని అన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాల వల్లే పది శాతం ఓట్లు కూటమికి పడ్డాయని అన్నారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి, అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన హామీలు ఎమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబు, వైసీపీ దాడులపై కాకుండా ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని అన్నారు. దాడుల సంస్కృతిని ప్రోత్సహించే పరిస్థితి రాకూడదని చంద్రబాబుకు హితవు పలికారు.
ఎన్నికల్లో వైయస్ఆర్సీపీకి ఓటు వేశాడని అజయ్ కుమార్ రెడ్డిని రోడ్డుపై ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టారే.. ఏం సాధిద్దామని?
పులివెందుల్లో ఇప్పటి వరకు ఇలాంటి దాడి సంస్కృతి లేదు. కానీ కొత్తగా @JaiTDP వాళ్లు దాడి సంప్రదాయానికి రాష్ట్రవ్యాప్తంగా బీజం వేస్తున్నారు
ఆపేయమని @ncbn కి… pic.twitter.com/SCqDUYeRJ5
— YSR Congress Party (@YSRCParty) July 6, 2024