Twitter: హ్యాకర్లు రెచ్చిపోయారు. వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేశారు. జగన్ ఫోటోలు, వీడియోలు, పార్టీ విషయాలతో నెటిజన్లకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందించే ఆ ట్విటర్ అకౌంట్ ఇప్పుడు అవుటాఫ్ కంట్రోల్.
శుక్రవారం అర్ధరాత్రి హ్యాకర్లు వైసీపీ ట్విటర్ ఖాతాను హ్యాక్ చేశారు. ‘YSR CONGRESS PARTY’ పేరుతో ఉన్న ఆ అకౌంట్ ను తమ కంట్రోల్లోకి తీసుకున్నారు హ్యాకర్లు. ప్రొఫైల్ ఫోటో మార్చేశారు. జంతువుల కార్టూన్ పిక్స్ పెట్టారు.
హ్యాకింగ్ విషయాన్ని గుర్తించిన వైసీపీ డిజిటల్ మీడియా అలర్ట్ అయింది. ట్విట్టర్ కు ఫిర్యాదు చేసింది. పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు చేస్తోంది.
సైబర్ నేరగాళ్లు వరుసబెట్టి దాడులు చేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ ఎయిమ్స్ నెటవర్కింగ్ పై అటాక్ చేశారు. ఐసీఎంఆర్ నూ హ్యాక్ చేసేందుకు 3వేల సార్లు ట్రై చేశారని తెలుస్తోంది. ఇలా దేశంలో ఏదో ఒక చోట హ్యాకర్ల ఎఫెక్ట్ ఉంటోంది. లేటెస్ట్ గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ జరిగింది. రికవరి చేయగలిగితే ఓకే. లేదంటే, హ్యాకర్లు భారీగా డబ్బులు డిమాండ్ చేసే ఛాన్స్ ఉంటుంది.