YCP Regional Coordinators Change : 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ నాయకత్వం…. పలు మార్పులకు శ్రీకారం చుడుతోంది. తాజాగా పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లలో మార్పులు చేసింది. పాత వారిని తప్పించి వారి స్థానంలో …కొత్తవారికి అవకాశం ఇచ్చారు. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు భూమన కరుణాకర్ రెడ్డికి అవకాశం కల్పించారు.
కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆకేటి అమర్నాథ్ రెడ్డి….విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. ఇక క్రిష్టా, గుంటూరు జిల్లాలకు ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి…నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలకు బాలినేని శ్రీనివాసరెడ్డిని…. అన్నమయ్య, సత్యసాయి,చిత్తూరు, అనంతపురం జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమించింది.
కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ఎమ్మెల్సీ భరత్ను..చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా తప్పించారు. అక్కడ మంత్రి నారాయణ స్వామిని నియమించారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కొడాలి నాని, అనిల్కుమార్లను…. ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల నుంచి తొలగించారు.