Vamsi krishna Srinivas Yadav : వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరారు. ఆయన పవన్ కల్యాణ్ను కలిశారు. వంశీకృష్ణ జనసేనలో చేరతారని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయనతో చర్చలు జరిపారు. పార్టీని వీడవద్దని కోరారు. అయినా సరే వంశీకృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చారు. ఈక్రమంలో ఆయన అనుచరులతోనూ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన కల్యాణ్ కలిసి ఆ పార్టీలో చేరిపోయారు.
తాను పార్టీ మారినట్టు అనిపించడం లేదని.. సొంత గూటికి వచ్చినట్టు ఉందన్నారు వంశీకృష్ణ. తాను వైసీపీకి రాజీనామా చేశానని.. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నానో అందరికి తెలుసన్నారు.
వంశీకృష్ణ జనసేనలో చేరడం సంతోషంగా ఉందన్నారు పవన్ కల్యాణ్. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వంశీకృష్ణ ఎంతో చేశారని.. ఇక ముందు కూడా కష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు.