EPAPER
Kirrak Couples Episode 1

AP Politics : వంశీకి చెక్ పెడతారా?.. దుట్టా, యార్లగడ్డ మీటింగ్ అందుకేనా?

AP Politics : వంశీకి చెక్ పెడతారా?.. దుట్టా, యార్లగడ్డ మీటింగ్ అందుకేనా?
AP Politics


AP Politics : గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టార్గెట్‌గా రాజకీయాలు వేడెక్కాయి. దుట్టా రామచంద్రరావుతో యార్లగడ్డ వెంకట్రావ్‌ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. వంశీకి చెక్ పెట్టేందుకే.. ఇద్దరు శత్రువులు ములాకత్ అయ్యారని అంటున్నారు.

2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరం నుంచి పోటీచేసిన వల్లభనేని వంశీ.. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డపై విజయం సాధించారు. గెలిచిన కొన్నాళ్లకే టీడీపీకి గుడ్ బై చెప్పేసి జగన్‌కు మద్దతిచ్చారు వంశీ. వైసీపీ కండువా కప్పుకోలేదు కానీ.. అనధికారిక సభ్యుడిగా కొనసాగుతున్నారు. అప్పటినుంచీ అసంతృప్తితో రగిలిపోతున్నారు యార్లగడ్డ వెంకట్రావ్. అటు, టికెట్ ఆశిస్తున్న దుట్టా రామచంద్రరావుకు సైతం వంశీతో పడటం లేదు. ఆ ముగ్గురు నేతల అనుచరుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. విషయం జగన్ వరకూ వెళ్లినా ఎవరూ తగ్గట్లే.


లేటెస్ట్‌గా యార్లగడ్డ, దుట్టా భేటీ కావడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. యార్లగడ్డ, దుట్టా ఇద్దరూ టీడీపీకి టచ్‌లో ఉన్నారనే వార్తలూ వస్తున్నాయి. వంశీకి బ్రేక్ వేయడానికి దుట్టా, యార్లగడ్డను టీడీపీ ప్రయోగిస్తోందని కూడా అంటున్నారు. వారి ట్రయాంగిల్ పోరుతో.. గన్నవరం రాజకీయం గరంగరంగా మారుతోంది.

Related News

Waiting For Help: సీఎం గారూ.. నా కొడుకును బ్రతికించండి, ఓ తల్లి కన్నీటి వ్యథ

Cm Chandrababu : శభాష్… చాలా మంచి పని చేశారు, ప్రజలను మెచ్చుకున్న సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్‌కు అస్వస్థత, ఆ సమస్య తిరగబడిందా?

Kadambari jethwani case : ముంబయి నటి కాదంబరి కేసులో కీలక పరిణామం… నేడో రేపో సీఐడీ చేతికి ?

AP Govt: దసరాకు సూపర్ కానుక ప్రకటించిన ప్రభుత్వం.. మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు

Home Minister: కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా?.. అయితే ఈ శుభవార్త తెలుసా..?

Pawan Klayan: వైసీపీకి ఝలక్ ఇచ్చిన పవన్.. విచారణ ఎదుర్కోవాల్సిందే.. రెడీగా ఉండండి అంటూ ప్రకటన

Big Stories

×