Kadapa : ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చాల మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాల జరిగాయి. ఇలాంటి ఘటనే కడప జిల్లా వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓబులమ్మ అనే మహిళ మృతి చెందింది. వేంపల్లి నారాయణ స్కూల్ కరస్పాండెంట్ తల్లి ఓబులమ్మ కింద పడటంతో ఆమెను వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ తల్లి చనిపోయిందని పేర్కొన్నారు.
హాస్పిటల్ కు వచ్చిన గంట తర్వాత డాక్టర్ వచ్చారని.. ఇవ్వాల్సిన డోసు కంటే ఎక్కువ డోస్ ఇవ్వడం వల్లనే తమ తల్లి చనిపోయిందని నారాయణరెడ్డి ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో తన తల్లిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. డాక్టర్ల నిర్లక్ష్యంపై జిల్లా వైద్య ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.